Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్నాళ్లకు నా కల నెరవేరింది... మా అమ్మానాన్న తొలిసారి విమానం ఎక్కారు..?

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (13:28 IST)
NeerajChopra
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, 121 ఏళ్ల భారత ఒలింపిక్ చరిత్రలో ఫీల్డ్ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ విన్నర్ నీరజ్ చోప్రా కల నెరవేరింది. టోక్యో ఒలింపిక్స్ 2020కి తర్వాత స్వదేశం చేరిన తర్వాత వరుసగా సభలు, సమావేశాలు, టీవీ ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడిపేశాడు. ఎట్టకేలకు కాసింత విశ్రాంతి సమయం దొరకడంతో తల్లిదండ్రులను తీసుకుని, విహార యాత్రకు బయలుదేరాడు.
 
నీరజ్ చోప్రా తండ్రి సతీశ్ కుమార్ ఓ సాధారణ రైతు. తల్లి సరోజ్ దేవి, గృహిణి. వీరికి నీరజ్ చోప్రాతో పాటు  ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. సతీశ్ కుమార్‌కి చిన్నప్పటి నుంచి విమానం ఎక్కాలనే కోరిక ఉండేది. అయితే కుటుంబపోషణ, ఆర్థిక సమస్యల కారణంగా, అది కలగానే మిగిలిపోయింది. 
 
నీరజ్ చోప్రా, తన తండ్రి కోరికను నిజం చేశాడు. తల్లిదండ్రులతో కలిసి విమాన ప్రయాణం చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన నీరజ్ చోప్రా... ‘నా చిన్న కల ఇన్నాళ్లకు నెరవేరింది. మా అమ్మానాన్న మొదటిసారి విమానం ఎక్కారు...’ అంటూ మురిసిపోతూ, తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments