Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరజ్ చోప్రాకు మహీంద్రా ఎక్స్ యూవీ-700 వాహనం కానుక

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (15:46 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత అథ్లెటిక్స్ రంగంలో హర్యానా కుర్రాడు నీరజ్ చోప్రా ఇప్పుడో సరికొత్త సంచలనంగా మారాడు. ఈ పోటీల్లో దేశానికి బంగారు పతకం సాధించిపెట్టాడు. తద్వారా ఒలింపిక్ చరిత్రలోనే అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పసిడి పతకం అందించిన ఘతను సొంతం చేసుకున్నాడు. దాంతో ఈ ఆర్మీ మ్యాన్‌పై నజరానాల వర్షం కురుస్తోంది. 
 
తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తమ కంపెనీ తయారు చేసిన వాహనాన్ని నీరజ్ చోప్రాకు బహూకరించనున్నట్టు తెలిపారు. చోప్రా టోక్యోలో బంగారు పతకం గెలిచిన తర్వాత ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేశారు. 
 
ఓవైపున టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ బాహుబలి చిత్రంలో ఈటెను పట్టుకుని గుర్రంపై వస్తున్న ఫొటో, మరో పక్కన జావెలిన్ త్రో విసురుతున్న నీరజ్ చోప్రా ఫొటోను ఆయన పంచుకున్నారు. నీరజ్ చోప్రాను బాహుబలిగా అభివర్ణించారు. మేమంతా నీ సైన్యంలో ఉన్నాం అని పేర్కొన్నారు.
 
ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ, నీరజ్ చోప్రాకు మహీంద్రా ఎక్స్ యూవీ-700 వాహనం కానుకగా అందించాలని సూచించాడు. అందుకు వెంటనే స్పందించిన ఆనంద్ మహీంద్రా... ఎక్స్ యూవీ వాహనాన్ని సిద్ధంగా ఉంచాలంటూ తన సంస్థ ఉద్యోగులను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

తర్వాతి కథనం
Show comments