Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీరజ్ చోప్రాకు వెల్లువెత్తుతున్న బహుమతులు.. ఇండిగో ఏడాదిపాటు..?

నీరజ్ చోప్రాకు వెల్లువెత్తుతున్న బహుమతులు.. ఇండిగో ఏడాదిపాటు..?
, శనివారం, 7 ఆగస్టు 2021 (21:28 IST)
Neeraj Chopra
టోక్యో ఓలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి. తాజాగా బడ్జెట్ కారియర్ ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఆ జాబితాలో చేరింది. విశ్వ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన నీరజ్ చోప్రాకు ఏడాది పాటు అపరిమితంగా ప్రయాణ టిక్కెట్లు ఇవ్వనున్నట్లు శనివారం ప్రకటించింది.
 
మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్స్‌లో పసిడి పతకాన్ని సాధించినందుకు గుర్తింపుగా ఈ బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు ఏడో తేదీ వరకు అపరిమితంగా విమాన ప్రయాణ టిక్కెట్లు ఉచితంగా అందజేస్తామని పేర్కొంది. 
 
ఇండిగో సీఈవో కం హోల్‌టైం డైరెక్టర్ రొనోజోయ్ దత్తా ఈ సందర్భంగా స్పందిస్తూ.. నీరజ్ దేశానికి స్వర్ణ పతకాన్ని సంపాదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ విమానాల్లో మీరు ప్రయాణించడానికి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. అలాగే ఏడాది పాటు ఉచితంగా విమాన ప్రయాణ టిక్కెట్లు ఇస్తామని వినయంతో తెలియజేస్తున్నామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సామాన్య రైతు బిడ్డ నీరజ్ చోప్రా గురించి తెలుసా? సీఎం జగన్ ఏమన్నారంటే?