Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరాజ్‌ చోప్రాకు కానుకల వర్షం - నేటితో ఒలింపిక్స్ క్రీడలకు ముగింపు

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (13:44 IST)
జపాన్ రాజధాని టోక్యో నగర వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2020 క్రీడల్లో ఆదివారంతో ముగియనున్నాయి. ఇప్పటివరకు భారత్ ఈ ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించింది. అందులో ఒక బంగారు పతకం కూడా ఉంది. అలాగే, రెండు రజతాలు, నాలుగు కాంస్య పథకాలు ఉన్నాయి. కాగా వీరందరికీ ఇప్పటికే ప్రభుత్వాలు రివార్డులు ప్రకటించాయి. 
 
అయితే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బిసిసిఐ కూడా టోక్యో ఒలింపిక్స్‌లో పథకాలు వచ్చిన వారందరికీ కూడా రివార్డులు ప్రకటించింది. ముఖ్యంగా జావలిన్ త్రో విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న సరికొత్త రికార్డు నెలకొల్పిన నీరజ్ చోప్రాకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించింది. 
 
అలాగే, రజత పతకాలు సాధించిన మీరాబాయి చాను, రవి దహియాలకు చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నారు. కాంస్యాలు సాధించిన పీవీ సింధు, భజరంగ్ పునియా, లవ్లీనా బొర్గోహైన్ లకు రూ.25 లక్షల చొప్పున ప్రదానం చేయనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో వెల్లడించారు.
 
మరోవైపు, ఈ ఒలింపిక్స్ క్రీడలు నేటితో ముగియనున్నాయి. కొవిడ్‌ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగానే నిర్వహించనున్నారు. జపాన్‌ జాతీయ స్టేడియంలో జరగనున్న ముగింపు వేడుకలు సాయంత్రం నాలుగున్నరకు ప్రారంభమవనున్నాయి. 
 
బాణాసంచా వెలుగు జిలుగులు, జపాన్‌ పాప్‌ సంగీతం కనువిందు చేయనుంది. ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు ముగింపు వేడుకల్లో ప్రసంగించనున్నారు. ప్యారీస్‌లో జరగబోయే 2024 ఒలింపిక్స్‌ గురించి ఒక పది నిమిషాల వీడియోను ప్రదర్శించనున్నారు. చివర్లో ఒలింపిక్స్‌ టార్చ్‌ను పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులకు అందించడంతో ముగింపు వేడుకలు ముగిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం సిద్ధరామయ్య చేసిన పనికి మనస్తాపంతో రిజైన్ చేసిన ఏఎస్పీ

మేనమామతో ప్రేమ - షూటర్లతో భర్తను చంపించిన నవ వధువు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం.. ఎలా జరిగింది?

ఢిల్లీలో దారుణం : ఫ్లాట్‌లో జంట హత్యలు - విగతజీవులుగా తల్లీకొడుకు

Cardiac Arrest: 170 కిలోల బరువు.. తగ్గుదామని జిమ్‌కు వెళ్లాడు.. గుండెపోటుతో మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

Uday Kiran: దిల్ రాజు సోదరుడే క్షమాపణ చెప్పారు.. మెగా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ ఓ లెక్కా? (Video)

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

తర్వాతి కథనం
Show comments