Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సామాన్య రైతు బిడ్డ నీరజ్ చోప్రా గురించి తెలుసా? సీఎం జగన్ ఏమన్నారంటే?

సామాన్య రైతు బిడ్డ నీరజ్ చోప్రా గురించి తెలుసా? సీఎం జగన్ ఏమన్నారంటే?
, శనివారం, 7 ఆగస్టు 2021 (21:31 IST)
టోక్యో ఒలింపిక్స్ 2020లో 87.58 మీటర్ల భారీ త్రోతో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో దేశంలో మొదటి బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు నీరజ్ చోప్రా. టోక్యోలో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లలో ఇది మొదటి ఒలింపిక్స్ పతకం.
 
భారతదేశం కోసం 121 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ పతకం. దీనితో నీరజ్ అభినవ్ బింద్రా సరసన చేరాడు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండవ భారతీయుడు నీరజ్. అతడి వయసు 23 సంవత్సరాలు. హర్యానాలోని పానిపట్ లోని ఖండార్ అనే చిన్న గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో 24 డిసెంబర్ 1997న జన్మించారు.
 
అతని తండ్రి శ్రీ సతీష్ కుమార్ ఒక రైతు. తల్లి శ్రీమతి సరోజ్ దేవి గృహిణి. నీరజ్ తన ఇద్దరు సోదరీమణులతో కలిసి పెరిగాడు. నిజానికి నీరజ్ బరువు తగ్గడానికి జావెలిన్ మొదలుపెట్టాడు, ఎందుకంటే అతడికి ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ. అది కాస్తా తనకు క్రీడగా మారిపోయింది. మిగిలినది ఇప్పుడు చరిత్ర. అతను ప్రపంచ U-20 ఛాంపియన్‌షిప్, పోలాండ్‌లో తన ప్రదర్శనతో ప్రాముఖ్యత పొందాడు. అక్కడ అతను 86.48 మీటర్లు విసిరి జూనియర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
webdunia
భువనేశ్వర్‌లో ఆసియా ఛాంపియన్‌షిప్ 2017లో 85.23 మీటర్లు విసిరాడు. నీరజ్ జర్మనీకి చెందిన లెజెండరీ మిస్టర్ ఉవే హోహ్న్ ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించాడు. కామన్వెల్త్ గేమ్స్ 2018లో 86.47 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ సాధించాడు. డైమండ్ లీగ్ 2018 యొక్క దోహా లెగ్‌లో తన వ్యక్తిగత అత్యుత్తమ 87.43 మీటర్లు విసిరాడు.
 
నీరజ్ రాజపుటనా రైఫిల్స్‌లో డైరెక్ట్ ఎంట్రీ నాయక్ సుబేదార్‌గా 15 మే 2016న నమోదు చేయబడ్డారు. ఇండియన్ ఆర్మీలో చేరిన తర్వాత, మిషన్ ఒలింపిక్స్ వింగ్, ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్, పూణేలో శిక్షణ కోసం ఎంపికయ్యారు. మిషన్ ఒలింపిక్స్ వింగ్, వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ పోటీలలో రాణించడానికి ఐదు మిషన్ ఒలింపిక్స్ నోడ్స్‌లో ఎంపిక చేసిన పదకొండు విభాగాలలో ఉన్నత క్రీడాకారులను గుర్తించి శిక్షణ ఇవ్వడానికి భారతీయ సైన్యం చొరవే కారణం.
 
మిషన్ ఒలింపిక్స్ వింగ్ దేశానికి షూటింగ్‌లో రెండు ఒలింపిక్ రజత పతకాలను అందించింది. నీరజ్ చోప్రా పతకం మిషన్ ఒలింపిక్స్ వింగ్ యొక్క కృషి, ప్రయత్నాలను చూపిస్తుంది. నీరజ్ క్రీడలలో రాణించినందుకు 2018లో అర్జున అవార్డు, 2020లో విశిష్టసేవ మెడల్ ప్రదానం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీరజ్ చోప్రాకు వెల్లువెత్తుతున్న బహుమతులు.. ఇండిగో ఏడాదిపాటు..?