Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 31న శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకంటే?

ఈనెల 31వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. 31వ తేదీ బుధవారం నాడు చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు పగటి పూటంతా మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సాయంత్రం 5

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (12:29 IST)
ఈనెల 31వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. 31వ తేదీ బుధవారం నాడు చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు పగటి పూటంతా మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సాయంత్రం 5.18 నుంచి రాత్రి 8.41 వరకు గ్రహణం ఏర్పడనుంది. 
 
అయితే, గ్రహణం ప్రారంభం కావడానికి 8 గంటల ముందుగానే ఆలయానికి తాళాలు వేయనున్నారు. ఈ కారణంగా రోజంతా స్వామివారి దర్శనం ఉండదని అధికారులు స్పష్టంచేశారు. గ్రహణం విడిచిన తర్వాత, ఆగమ శాస్త్ర ప్రకారం, ఆలయాన్ని శుద్ధి చేసి, పుణ్యాహవచనం తర్వాతే భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు. 
 
అంటే, 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి భక్తులను తితిదే అనుమతించనుంది. అయితే, బుధవారం తెల్లవారుజామున జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

తర్వాతి కథనం
Show comments