Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి 31న శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకంటే?

ఈనెల 31వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. 31వ తేదీ బుధవారం నాడు చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు పగటి పూటంతా మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సాయంత్రం 5

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (12:29 IST)
ఈనెల 31వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. 31వ తేదీ బుధవారం నాడు చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాదాపు పగటి పూటంతా మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సాయంత్రం 5.18 నుంచి రాత్రి 8.41 వరకు గ్రహణం ఏర్పడనుంది. 
 
అయితే, గ్రహణం ప్రారంభం కావడానికి 8 గంటల ముందుగానే ఆలయానికి తాళాలు వేయనున్నారు. ఈ కారణంగా రోజంతా స్వామివారి దర్శనం ఉండదని అధికారులు స్పష్టంచేశారు. గ్రహణం విడిచిన తర్వాత, ఆగమ శాస్త్ర ప్రకారం, ఆలయాన్ని శుద్ధి చేసి, పుణ్యాహవచనం తర్వాతే భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు. 
 
అంటే, 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి భక్తులను తితిదే అనుమతించనుంది. అయితే, బుధవారం తెల్లవారుజామున జరిగే సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments