టిటిడి గుడ్ న్యూస్.. బస్సులో తీసుకెళ్లి ఫ్రీ దర్శనం

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:17 IST)
టిటిడి జిల్లాల్లో స్వామివారి ఆలయాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయా జిల్లాల్లోని వెనక బడిన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. వారిని బస్సులో ఉచితంగా తీసుకువచ్చి స్వామి వారి దర్శనం చేయించేందుకు నిర్ణయం తీసుకుంది. 
 
ఈ విషయాన్ని టిటిడి ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు. స్థానిక అన్నమయ్య భవనం లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జవహర్ రెడ్డి మాట్లాడుతూ… వచ్చేనెల 7 నుండి 15 తేదీల మధ్య సాలకట్ల బ్రహ్మోత్సవాలు నితవించనున్నట్టు తెలిపారు.
 
ఈ సందర్భంగా 500 నుండి 1000 మంది భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించారు. దానికోసం కావాల్సిన విధి విధానాలను సిద్దం చేయాలని అధికారులకు జవహర్ రెడ్డి ఆదేశించారు. 
 
అదే విధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా అలిపిరి మార్గాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా అక్టోబర్ కు సంబందించి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను రేపు ఉదయం 9గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ సార్, నా చేయి విరిగింది చూడండి, ప్లీజ్ మా ఊరికి రోడ్డు వేయండి: విద్యార్థి వీడియో

భర్తను రూ.1.5 కోట్లకు ప్రియురాలికి అమ్మేసిన భార్య.. అలా సెటిలైపోయింది..

బిల్ గేట్స్‌కి కొబ్బరి చట్నీ, కరకరలాడే అమరావతి పునుగులు

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ జియో పెవిలియన్‌ సందర్శన

ఉండవల్లి అరటితోటలో బిల్ గేట్స్.. స్వర్ణ ఆంధ్ర 2047 సూపర్ అంటూ కితాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

11-02-2026 బుధవారం ఫలితాలు - వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు....

తర్వాతి కథనం
Show comments