Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ సీఎం జగన్‌కి కిషన్ రెడ్డి లేఖ- నేను ఎవ్వరికీ సిఫార్సు చేయలేదు..

Advertiesment
ఏపీ సీఎం జగన్‌కి కిషన్ రెడ్డి లేఖ- నేను ఎవ్వరికీ సిఫార్సు చేయలేదు..
, శనివారం, 18 సెప్టెంబరు 2021 (19:11 IST)
టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వనితుల నియామకంలో ట్విస్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌కి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తన సిఫార్సుతో రవిప్రసాద్ అనే వ్యక్తికి పాలకమండలి ప్రత్యేక ఆహ్వనితుడిగా నియామకం జరిగినట్లు ప్రచారం జరుగుతుందని విస్మయం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను కానీ, తన మంత్రిత్వ శాఖ ద్వారా కానీ.. ఎవరికి పదవీ ఇవ్వాలని సిఫార్సు చేయలేదని లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 
 
ఈ అంశం పై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిశీలన జరపాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాగా.. రెండు రోజుల కింద టీటీటీ పాలక మండలి సభ్యులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియామకం చేసిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాణిపాకం వినాయకుడికి టీటీడీ పట్టు వస్త్రాల స‌మర్ప‌ణ‌