Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిపోతున్న భక్తుల కానుకలు.. రూ.కోట్లు దాటుతున్న శ్రీవారి ఆదాయం

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (09:27 IST)
తిరుమలలో వెలసివున్న కలియుగ ప్రత్యక్షదేవంగా కోటానుకోట్ల మంది కొలిచే శ్రీవేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం నానాటికీ పెరిగిపోతోంది. కరోనా లాక్డౌన్ తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి తితిదే అధికారులు అనుమతి ఇచ్చారు. ఇలా కొండపైకి వచ్చే భక్తులు సమర్పించుకునే కానుకలతో హుండీ ఆదాయం పెరిగిపోతోంది. 
 
ఫలితంగా ఆదివారం ఏకంగా రూ.2.26 కోట్లుగా ఉంది. ఆదివారం స్వామివారిని 32,640 మంది భక్తులు దర్శించుకున్నారని, 10,946 మంది తలనీలాలు సమర్పించారని అధికారులు తెరిపారు. ఆలయ పరిధిలో కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నట్టు తెలిపారు.
 
కాగా, రేపు ఉదయం తిరుమలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు తిరుపతి చేరుకునే ఆయన, తొలుత తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆపై మధ్యాహ్నం తిరుమలకు వెళ్లి, స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తారు. కోవింద్ పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

"ఆపరేషన్ సింధూర్" అంటే ఏమిటి!

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

అన్నీ చూడండి

లేటెస్ట్

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

తర్వాతి కథనం
Show comments