Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిపోతున్న భక్తుల కానుకలు.. రూ.కోట్లు దాటుతున్న శ్రీవారి ఆదాయం

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (09:27 IST)
తిరుమలలో వెలసివున్న కలియుగ ప్రత్యక్షదేవంగా కోటానుకోట్ల మంది కొలిచే శ్రీవేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం నానాటికీ పెరిగిపోతోంది. కరోనా లాక్డౌన్ తర్వాత పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి తితిదే అధికారులు అనుమతి ఇచ్చారు. ఇలా కొండపైకి వచ్చే భక్తులు సమర్పించుకునే కానుకలతో హుండీ ఆదాయం పెరిగిపోతోంది. 
 
ఫలితంగా ఆదివారం ఏకంగా రూ.2.26 కోట్లుగా ఉంది. ఆదివారం స్వామివారిని 32,640 మంది భక్తులు దర్శించుకున్నారని, 10,946 మంది తలనీలాలు సమర్పించారని అధికారులు తెరిపారు. ఆలయ పరిధిలో కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నట్టు తెలిపారు.
 
కాగా, రేపు ఉదయం తిరుమలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు తిరుపతి చేరుకునే ఆయన, తొలుత తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆపై మధ్యాహ్నం తిరుమలకు వెళ్లి, స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తారు. కోవింద్ పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments