Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై శ్రీవారి ప్రసాదం చేదు... ఎందుకంటే?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం ఇకపై తీపికి బదులు చేదుగా మారనుంది. దీనికి కారణం లేకపోలేదు. శ్రీవారి ప్రసాదాలైన లడ్డూ, వడ, తదితర ప్రసాదాల ధరలను పెంచేందుకు తిరుమల తిరుపతి దే

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (17:55 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం ఇకపై తీపికి బదులు చేదుగా మారనుంది. దీనికి కారణం లేకపోలేదు. శ్రీవారి ప్రసాదాలైన లడ్డూ, వడ, తదితర ప్రసాదాల ధరలను పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం శ్రీవారి కల్యాణోత్సవాలు, ఆలయాల కుంభాబిషేకాలు, ఇతరాత్రా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విజ్ఙాపనలపై టీటీడీ లడ్డూ, వడ ప్రసాదాలను విక్రయిస్తుంది. వీటి ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుని ధరలను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. 
 
ఇందులోభాగంగా, సాధారణ లడ్డూను 25రూ నుంచి 50 రూపాయలకు, శ్రీవారి కల్యాణం లడ్డూ ధరను రూ 100 నుంచి 200కు గాను, వడ రూ 25 నుంచి 50రూపాయలకు గాను, మినీ లడ్డూను రూ 3.50 నుంచి 7రూపాయలకు పెంచారు. 
 
సిపార్సులపై ఇచ్చే లడ్డూ ప్రసాదాన్ని కూడా పెంచాలని టీటీడీ భావిస్తోంది. అలాగే, సిఫార్సు లేకపోయినప్పటికీ సాధారణ భక్తులకు కూడా కోరినన్ని నడ్డూలను ఇవ్వాలని తితిదే భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments