Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిటిడి పాలకమండలిలోకి ఉపరాష్ట్రపతి కుమార్తె దీపా వెంకట్...

దాదాపు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న టిటిడి నూతన పాలకమండలి నియామక ప్రకటన ఈ వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన పాలకమండలిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, సామాజిక సేవకురాలు దీప వెంకట్‌కు స్థానం లభించనుందని సమాచారం. అదేవిధంగా పీలేరుకు చెంద

టిటిడి పాలకమండలిలోకి ఉపరాష్ట్రపతి కుమార్తె దీపా వెంకట్...
, శనివారం, 25 నవంబరు 2017 (17:09 IST)
దాదాపు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న టిటిడి నూతన పాలకమండలి నియామక ప్రకటన ఈ వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన పాలకమండలిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, సామాజిక సేవకురాలు దీప వెంకట్‌కు స్థానం లభించనుందని సమాచారం. అదేవిధంగా పీలేరుకు చెందిన చల్లాబాబుకు చోటు లభించనుంది. 
 
తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి సిఫార్సుతో చల్లా బాబుకు బోర్డులో స్థానం కల్పిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా పాతబోర్డులోని సినీ నిర్మాత, దర్శకుడు రాఘవేంద్రరావుకు మరోసారి పాలకమండలిలో అవకాశం దక్కనుంది. 
 
అయితే గత రెండు నెలల వరకు కూడా వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ పేరు వినబడకపోయినా తాజాగా ముఖ్యమంత్రి స్వయంగా అనుకుని మరీ ఆమెకు ఈ పదవి ఇవ్వనున్నారట. ఇదే విషయాన్ని వెంకయ్యనాయుడు దృష్టికి చంద్రబాబు కూడా తీసుకెళ్ళారట. టిటిడి బోర్డు సభ్యురాలిగా ఉండటం దీపా వెంకట్‌కు కూడా ఇష్టమేనంటున్నారు. శ్రీవారి చెంత ఉండటం ఎంతో మంచిదన్న ఆలోచన ఆమెది. అందుకే చంద్రబాబు చెప్పగానే దీప ఒకే అనేశారట. అయితే టిటిడి ఛైర్మన్ ఎవరన్నది మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'డోల్ భాజే' పాట‌కు మానుషి నృత్యం.. వీడియో వైరల్