శ్రీవారి ఆలయం ఎదుట పందుల సంచారం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు పందులు సంచరించాయి. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో వరాహాల మంది తిరుమల శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి తమ ఇష్టానుసారం పరుగులు పెడుతుంటే, టీటీడీ అధికారులు గమనించ

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (10:43 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు పందులు సంచరించాయి. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో వరాహాల మంది తిరుమల శ్రీవారి ఆలయం ముందుకు వచ్చి తమ ఇష్టానుసారం పరుగులు పెడుతుంటే, టీటీడీ అధికారులు గమనించకపోవడం భక్తులు విస్తుపోయేలా చేసింది. ఏడు పందుల మంద ఒకటి బేడీ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి మెట్లు దిగి కిందకు వచ్చి, ఆయన మందు వరకూ వెళ్లి, అక్కడి నుంచి దక్షిణ మాడవీధిలోకి పరుగులు పెట్టాయి. 
 
అత్యంత పవిత్రంగా భావించే తిరుమాడ వీధుల్లో ఇవి తిరగడం భక్తులందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా భక్తులను ఇక్కడ చెప్పులతో తిరగనివ్వరు. అలాంటి చోట పందులు తిరగడంపై అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. టీటీడీ నిఘా విభాగం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. బేడీ ఆంజయనేయ స్వామి ఆలయం ముందు నుంచి దక్షిణ మాడ వీధుల్లోకి వచ్చినట్టు చెబుతున్నారు భక్తులు. తిరుమలలో పందులను నియంత్రించాలని గతంలో ఈఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్థానిక సంస్థల్లో పోటీ- ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ

విద్యార్థులకు శుభవార్త చెప్పిన టి విద్యాశాఖ.. ఫీజుల చెల్లింపులపై క్లారిటీ

కర్నూలు బస్సు ప్రమాదం.. అగ్నికీలల్లో కుటుంబ సభ్యులంతా సజీవదహనం

Palle Panduga 2.0: గ్రామాభివృద్ధికి ఆర్థిక స్థిరత్వం కీలకం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

karthika maasam food: కార్తీక మాసంలో తినాల్సిన ఆహారం ఏమిటి, తినకూడనవి ఏమిటి?

టీటీడీకి రూ.900 కోట్లు-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పెరిగిన విరాళాలు

Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. దీపారాధన, దీపదానం.. బిల్వార్చన చేస్తే?

22-10-2025 బుధవారం దినఫలాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం.. నిర్విరామంగా శ్రమిస్తారు...

21-10-2025 మంగళవారం దినఫలాలు - ఆత్మీయులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది...

తర్వాతి కథనం
Show comments