Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు ఇక పండుగే, లడ్డూలే లడ్డూలు.. ఎక్కడ దొరుకుతాయంటే?

Webdunia
శనివారం, 23 మే 2020 (17:38 IST)
శ్రీవారి ప్రసాదమంటే భక్తులకు ఎంతో ప్రీతి. ఆ స్వామివారిని దర్సనం చేసుకున్న తరువాత లడ్డూలు కొనుక్కుని వెళ్ళడం ఆనవాయితీ. తిరుపతి వెళ్ళొచ్చామంటే ఎవరైనా అడిగేది ఆ స్వామివారి ప్రసాదమే. అలాంటి ప్రసాదం.. స్వామివారి దర్సనం గత రెండు నెలలుగా దూరమైంది భక్తులకు. అయితే లడ్డూలను భక్తులను పంపిణీ చేసేందుకు టిటిడి సిద్థమైంది.
 
ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో లడ్డూలను టిటిడి కళ్యాణ మండపాల్లో భక్తులకు అందుబాటులో ఉంచుతామని టిటిడి ప్రకటించింది. ప్రకటించిన విధంగానే తిరుమల నుంచి లారీలలో లడ్డూలు బయలుదేరాయి. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు లడ్డూ ప్రసాదాలను తీసుకువెళ్ళే లారీలను శనివారం ఉదయం ఆయన ప్రారంభించారు.
 
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భక్తులకు తిరుమల శ్రీవారి దర్సనాన్ని దాదాపు 60 రోజులగా నిలిపివేసినట్లు తెలిపారు తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి. తిరిగి భక్తులకు స్వామి వారి దర్సనాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో అధికసంఖ్యలో భక్తులు ఇ-మెయిల్, వాట్సాప్, ఫోన్లల ద్వారా తమకు స్వామివారి లడ్డూ ప్రసాదం అయినా అందించాలని విజ్ఞప్తులు వచ్చాయన్నారు. 
 
భక్తుల అభ్యర్థనలు పరిగణలోకి తీసుకుని, లాభనష్టాలను చూడకుండా 50 వేల నుంచి 20 వేల లడ్డూలను ఉంచనున్నట్లు తెలిపారు. కళ్యాణ మండపాల్లోని టిటిడి ఉద్యోగులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, పోలీసు, రెవిన్యూ అధికారుల సమన్వయంతో భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విశాఖపట్నం, గుంటూరు, క్రిష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు రెండు లారీలలో లడ్డూప్రసాదాలు బయలుదేరాయని సోమవారం నుంచి భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ విద్యా నమూనాను ప్రపంచానికి ఉదాహరణ మార్చాలి.. నారా లోకేష్ పిలుపు

2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం

Heavy Rains : హైదరాబాద్ వాసులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి.. పోలీసులు

ప్రవాసీ రాజస్థానీ దివస్ లోగోను ఆవిష్కరించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి

పోలీస్ స్టేషన్‌కి సాయం కోసం వెళ్తే.. అందంగా వుందని అలా వాడుకున్నారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు భారత్‌లో తొలి ఏఐ కమాండ్ సెంటర్

24-09-2025 బుధవారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగించండి...

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: షట్చక్రములు చూచుటకై కక్కయ్య తన భార్యను ముక్కలు చేయుట

Sami Tree: దసరా సందర్భంగా జమ్మి చెట్టును ఇంట్లో నాటితే అంత అదృష్టమా?

23-09-2025 సోమవారం ఫలితాలు - లావాదేవీలు కొలిక్కివస్తాయి.. సకాలంలో చెల్లింపులు జరుపుతారు...

తర్వాతి కథనం
Show comments