Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల శ్రీవారి దర్శనం లేదు, కానీ ఇ-హుండీకి భక్తులు కోటీ 97 లక్షలు - video

తిరుమల శ్రీవారి దర్శనం లేదు, కానీ ఇ-హుండీకి భక్తులు కోటీ 97 లక్షలు - video
, బుధవారం, 20 మే 2020 (23:02 IST)
తిరుమల శ్రీవారి భక్తులు ఎంతో భక్తిభావంతో తినే స్వామివారి ప్రసాదం రేటును టిటిడి తగ్గించింది. చిన్న లడ్డూను ఇప్పటివరకు ఒక్కొక్కటి 50 రూపాయలకు విక్రయించేవారు. కానీ ఆ ధరను 25 రూపాయలకు తగ్గిస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భక్తులకు కావాల్సినన్ని లడ్డూలను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
 
ఎల్లుండి నుంచి లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. ఎపిలోని టిటిడి కళ్యాణ మండపాల్లో లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే 3 నుంచి 4 లక్షల లడ్డూలను ప్రతిరోజు తయారుచేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి భక్తుల కోరిక మేరకు లడ్డూలను అందిస్తున్నట్లు.. అది కూడా తక్కువ రేటుకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు టిటిడి ఛైర్మన్ చెప్పారు.
 
ముఖ్యంగా ఈ-హుండీ ద్వారా ఎవరైతే స్వామివారికి మ్రొక్కుల రూపంలో నగదును చెల్లిస్తారో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అవసరాన్ని బట్టి భక్తులకు 5 వేల లడ్డూల వరకు అందజేస్తామన్నారు. శ్రీవారి దర్సనం తిరిగి ప్రారంభమయ్యేంతవరకు భక్తులకు లడ్డూలు అందుబాటులో ఉంటాయన్నారు. శ్రీవారి భక్తులకు దర్సనం కల్పించకపోయినా ఈ-హుండీ ద్వారా కోటి 97 లక్షల రూపాయల ఆదాయం ఈ యేడాది వచ్చినట్లు టిటిడి ఛైర్మన్ తెలిపారు. 
 
శ్రీవారి దర్సనం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడే చెప్పలేమని.. టిటిడి కాంట్రాక్ట్ కార్మికులకు నెల నెలా సరైన రీతిలో జీతాలను అందజేస్తున్నట్లు చెప్పారు. జీతాలు ఇవ్వలేనంత దీనస్థితిలో టిటిడి లేదని టిటిడి ఛైర్మన్ స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా నుంచి చెన్నై కోలుకునేనా? ఒక్క రోజే 743 పాజటివ్ కేసులు