Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కంటైన్మెంట్ జోనా? జిల్లా కలెక్టర్ ఏమంటున్నారు?

Webdunia
గురువారం, 9 జులై 2020 (19:46 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుమల పట్టణం కరోనా కంటోన్మెంట్ జోనుగా మారిందా? ఎందుకంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో పని చేస్తున్న సిబ్బందిలో 80 మందికి కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో తిరుమలను కంటైన్మెంట్ జోన్ చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. దీంతో భక్తులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
తితిదే అధికారులు కూడా అవాక్కయ్యారు. ఆ తర్వాత తాము చేసిన తప్పను తెలుసుకుని సరిదిద్దారు. అయితే పొరపాటున తిరుమలను కంటైన్మెంట్ జోనుగా ప్రకటించామంటూ జిల్లా కలెక్టర్ మరో లిస్టును విడుదల చేశారు. తాజా ప్రకటనతో శ్రీవారి భక్తులకు ఆటంకం తొలగిపోయింది.
 
తిరుమలను కంటైన్మెంట్ జోనుగా గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రకటించారు. ఆ తర్వాత గంట వ్యవధిలోనే మరో ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూ, భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా తిరుమలకు రావొచ్చని తెలిపారు. ప్రస్తుతానికి రోజుకు 10 వేల మందిని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కూడా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా కేసులు డబుల్ సెంచరీ కొట్టాయి. ఇందులో చిత్తూరు జిల్లాలో అధిక సంఖ్యలో ఈ కేసులు నమోదు కావడం ఇపుడు కలకలం రేపుతోంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments