Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కంటైన్మెంట్ జోనా? జిల్లా కలెక్టర్ ఏమంటున్నారు?

Webdunia
గురువారం, 9 జులై 2020 (19:46 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుమల పట్టణం కరోనా కంటోన్మెంట్ జోనుగా మారిందా? ఎందుకంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో పని చేస్తున్న సిబ్బందిలో 80 మందికి కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో తిరుమలను కంటైన్మెంట్ జోన్ చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. దీంతో భక్తులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
తితిదే అధికారులు కూడా అవాక్కయ్యారు. ఆ తర్వాత తాము చేసిన తప్పను తెలుసుకుని సరిదిద్దారు. అయితే పొరపాటున తిరుమలను కంటైన్మెంట్ జోనుగా ప్రకటించామంటూ జిల్లా కలెక్టర్ మరో లిస్టును విడుదల చేశారు. తాజా ప్రకటనతో శ్రీవారి భక్తులకు ఆటంకం తొలగిపోయింది.
 
తిరుమలను కంటైన్మెంట్ జోనుగా గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రకటించారు. ఆ తర్వాత గంట వ్యవధిలోనే మరో ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూ, భక్తులు ఎలాంటి ఆందోళన లేకుండా తిరుమలకు రావొచ్చని తెలిపారు. ప్రస్తుతానికి రోజుకు 10 వేల మందిని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కూడా భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా కేసులు డబుల్ సెంచరీ కొట్టాయి. ఇందులో చిత్తూరు జిల్లాలో అధిక సంఖ్యలో ఈ కేసులు నమోదు కావడం ఇపుడు కలకలం రేపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

తర్వాతి కథనం
Show comments