Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాసుడు నైవేద్య ప్రియుడు, ఎన్ని వంటలు నైవేద్యమంటే..?

Webdunia
గురువారం, 1 జులై 2021 (17:08 IST)
శ్రీవారికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో నైవేద్యంతో సమర్పించేందుకు దాతలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. పురాతన కాలం నాటి సాంప్రదాయాన్ని శ్రీవారి ఆలయంలో రెండు నెలల ముందు నుంచి తిరిగి ప్రారంభించింది టిటిడి.
 
ప్రస్తుతం స్వామివారికి సమర్పించే నైవేధ్యానికి ఆర్గానికి పదార్థాలను వినియోగిస్తుండగా భవిష్యత్తులో భక్తులకు అందించే ప్రసాదాలు కూడా ఈ పదార్థాలనే వినియోగించనుంది టిటిడి. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుడు ఎంతటి భక్తజన ప్రియుడో అంతటి నైవేద్యప్రియుడు. అందుకే శ్రీవారికి ప్రతిరోజు ఆరు సమయాల్లో  నైవేద్యాన్ని సమర్పిస్తారు. వేకువజామున సుప్రభావం మొదలుకుని రాత్రి ఏకాంత సేవ వరకు స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. 
 
మరే ఆలయంలోను ఇన్ని రకాల ప్రసాదాలు సమర్పించరు. లడ్డు, వడ, అప్పం, దోస, పోలి, చుక్కీలు, పాయసం, మురుకు, జిలేబి, ఇలా ఎన్నో రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. పూర్వం స్వామివారికి గోవు ఆధారిత పండించిన పదార్థాలతో నైవేధ్యం సమర్పించేవారు. కాలం క్రమేణా వ్యవసాయ పద్ధతులు మారుతూ వస్తుండడంతో నైవేద్యంలో  వినియోగించే పదార్థాలు కూడా మారాయి.
 
గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాల లభ్యత తక్కువగా ఉండడంతో టిటిడి కూడా ఎరువులతో పండించిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ప్రారంభించింది. పూర్తిస్థాయిలో వాటినే వినియోగించడం మొదలుపెట్టింది. స్వామివారికి రామానుజస్వామివారు నిర్ధేశించిన విధంగానే నైవేధ్యం సమర్పణ జరుగుతున్నా గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్ధాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి ఏర్పాటు చేశారు మాజీ పాలకమండలి సభ్యులు శివకుమార్.
 
గోవు ఆధారిత పంటలతో పండించిన పదార్ధాలతో ప్రయోగాత్మకంగా ప్రసాదాలను తయారుచేసి సమర్పించారు. ప్రసాదం రుచి కూడా గతంలో కంటే బాగా పెరగడంతో మొదటిదశలో భాగంగా స్వామివారికి సమర్పించే నైవేధ్యం పెట్టడానికి వీటిని వినియోగించాలని నిర్ణయించింది టిటిడి. 
 
స్వామవారికి ప్రతినిత్యం 194 కేజీల బియ్యంతో 11 కేజీల రవ్వతో ప్రసాదాన్ని తయారుచేస్తారు. వీటిని ఉచితంగా అందిస్తామంటున్నారు రైతు విజయారావు. అంచెలంచెలుగా శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాలను వినియోగించాలని టిటిడి పాలకమండలి తీర్మానం చేసింది.
 
దాతలు కూడా టిటిడి గోవు ఆధారిత పంటతో పండించిన పదార్థాలను విరాళాలుగా అందిస్తున్నారు. కోటి రూపాయలు విలువచేసే 26రకాల పదార్ధాలను దేశవ్యాప్తంగా సేకరించి టిటిడికి అందజేశారు చిన్నజియ్యర్ స్వామి, మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు. స్వామివారికి ఆరునెలల పాటు నైవేధ్యం సమర్పించే వస్తువులను అందజేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments