Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ వేసుకుంటేనే జూలై నెల జీతం : తితిదే కఠిన నిర్ణయం

Webdunia
గురువారం, 1 జులై 2021 (13:19 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం కఠిన నిర్ణయం తీసుకుంది. తితిదేలో పని చేస్తున్న వారిలో 45 యేళ్లుదాటిన వారంతా విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని స్పష్టం చేసింది. అలాంటి వారికి మాత్రం జీతం ఇస్తామని తేల్చి చెప్పింది. 
 
టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 45 సంవత్సరాలు పైబడి ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని వారికి జీతాలు నిలిపివేయాలని ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. చాలామంది ఉద్యోగులు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదని గుర్తించిన టీటీడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
 
కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ చురుగ్గా సాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నాయి. 
 
అయితే ఉచితంగా వద్దు అనుకున్న వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రుసుము చెల్లించి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. కార్పోరేట్ సంస్థలతో పాటు అనే కంపెనీలు తమ ఉద్యోగులకు కార్యాలయాల్లోనే వ్యాక్సిన్లు వేయిస్తున్నాయి. 
 
ఈ కోవలోనే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కూడా తమ ఉద్యోగులకు వ్యాక్సిన్లు వేయిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఉద్యోగులకు గట్టి ఝలక్ ఇచ్చింది. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 45 సంవత్సరాలు పైబడి ఇంకా వ్యాక్సిన్ వేయించుకోని వారికి జీతాలు నిలిపివేయాలని ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. 
 
చాలామంది ఉద్యోగులు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోలేదని గుర్తించిన టీటీడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జులై 7 లోపు ఆ ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేయించుకుని సంబంధిత సర్టిఫికెట్లను ఆయా డిపార్ట్‌మెంట్లలో అందజేయాలని ఈవో ఆదేశించారు. జులై 7 లోపు వ్యాక్సిన్ వేసుకున్న ఉద్యోగులకు జూలై 8న జీతాలు చెల్లించాలని ఈవో ఆదేశాలు జారీ చేసారు. 
 
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. త్వరలోనే సర్వదర్శనం కూడా అమలు చేయనున్న నేపథ్యంలో ఉద్యోగులందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని టీటీడీ అధికారులు ఆదేశించారు. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు అలసత్వం వహిస్తుండటంతో ఈవో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

దిన కూలీకి అదృష్టం అలా వరించింది..

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

అన్నీ చూడండి

లేటెస్ట్

23-07-2025 బుధవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య 2025: వ్రత కథ.. పితృదేవతలకు తర్పణం ఇవ్వకపోతే?

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఏం చేయాలి?

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

తర్వాతి కథనం
Show comments