Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తితిదే పాలక మండిలికి మంగళం... ఇకపై స్పెసిఫైడ్ అథారిటీ

తితిదే పాలక మండిలికి మంగళం... ఇకపై స్పెసిఫైడ్ అథారిటీ
, గురువారం, 24 జూన్ 2021 (09:57 IST)
ఆంధ్రప్రశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలికి మంగళంపాట పాడింది. ఈ పాలక మండలి స్థానంలో విశేష అథారిటీ(స్పెసిఫైడ్‌ అథారిటీ)ని నియమించింది. ఈ అథారిటీకి చైర్మన్‌గా టీటీడీ ఈవో, కన్వీనర్‌గా అదనపు ఈవో ఉంటారని తెలిపింది.
 
ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలోని ట్రస్టు బోర్డు కాలపరిమితి ముగియడంతో ఈ అథారిటీని నియమించినట్లు బుధవారం జారీ చేసిన జీవోలో పేర్కొంది. తదుపరి ఆదేశాల వరకూ ఈ అథారిటీ కొనసాగుతుందని, ట్రస్టు బోర్డు నిర్వర్తించే కార్యకలాపాలన్నీ ఈ అథారిటీ చేపడుతుందని వివరించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌కు ఈసీ షాక్