Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మరోసారి చిరుత సంచారం- ఫిబ్రవరిలో తిరుమల విశేషాలు

సెల్వి
గురువారం, 30 జనవరి 2025 (20:24 IST)
తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తుల్లో కలకలం రేపుతోంది. తిరుమల శిలాతోరణం వద్ద చిరుత పులి సంచారాన్ని భక్తులు గుర్తించారు. వెంటనే భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను అప్రమత్తం చేశారు. 
 
మరోవైపు ఫిబ్రవరిలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే పర్వదినాలు, ఇతర విశేష ఉత్సవాలకు సంబంధించిన వివరాలను టీటీడీ అధికారులు విడుదల చేశారు. 2వ తేదీన వసంత పంచమితో ఈ ఉత్సవాలు ఆరంభమౌతాయి. 26వ తేదీన మహా శివరాత్రితో ముగుస్తాయి. 
 
ఫిబ్రవరి 4వ తేదీన రథ సప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేపట్టారు. 5వ తేదీన- భీష్మాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు టీటీడీ అధికారులు. 
 
6న మధ్వ నవమి, 8న భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేష ఉత్సవాలను జరుపుతారు. 12న శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి, అదే రోజున మాఘ పూర్ణిమ వేడుకలను చేపడతారు. 24వ తేదీన సర్వ ఏకాదశి, 26న మహాశివరాత్రి పండగను కన్నులపండుగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని ముందుగానే అంచన వేయాలని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

లేటెస్ట్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

Nag Panchami 2025: నాగపంచమి రోజున నాగుల పూజ ఎందుకు.. కుండలినీ శక్తిని?

తర్వాతి కథనం
Show comments