Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

సెల్వి
గురువారం, 30 జనవరి 2025 (14:27 IST)
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిపాలన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) తరహాలో ఆలయానికి పాలక మండలిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. బోర్డు ఏర్పాటుకు ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దాని ఏర్పాటు కోసం తయారు చేసిన ముసాయిదా మార్గదర్శకాలకు కొన్ని మార్పులను సూచించారు.
 
యాదాద్రి ఆలయ పాలక మండలిని నియమించడానికి నిబంధనలపై చర్చించడానికి బుధవారం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుమ‌ల మాదిరిగానే యాద‌గిరిగుట్ట ఆల‌యం స‌మీపంలోనూ రాజ‌కీయాలకు తావులేకుండా చూడాల‌న్నారు. ఆల‌య పవిత్రకు భంగం క‌ల‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని చెప్పారు. 
 
ధర్మకర్తల మండ‌లి నియామ‌కంతో పాటు యాదగిరిగుట్ట ఆల‌యం త‌ర‌ఫున చేప‌ట్టాల్సిన ప‌లు ఆధ్యాత్మిక‌, సేవా కార్యక్రమాల్లోని ముసాయిదాలో పేర్కొన్న నిబంధ‌న‌ల‌కు సీఎం రేవంత్ ప‌లు మార్పులు సూచించారు. వాటిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, తిరుమల తరహాలో యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటైతే ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తర్వాతి కథనం
Show comments