Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

సెల్వి
గురువారం, 30 జనవరి 2025 (14:27 IST)
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిపాలన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) తరహాలో ఆలయానికి పాలక మండలిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. బోర్డు ఏర్పాటుకు ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దాని ఏర్పాటు కోసం తయారు చేసిన ముసాయిదా మార్గదర్శకాలకు కొన్ని మార్పులను సూచించారు.
 
యాదాద్రి ఆలయ పాలక మండలిని నియమించడానికి నిబంధనలపై చర్చించడానికి బుధవారం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుమ‌ల మాదిరిగానే యాద‌గిరిగుట్ట ఆల‌యం స‌మీపంలోనూ రాజ‌కీయాలకు తావులేకుండా చూడాల‌న్నారు. ఆల‌య పవిత్రకు భంగం క‌ల‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని చెప్పారు. 
 
ధర్మకర్తల మండ‌లి నియామ‌కంతో పాటు యాదగిరిగుట్ట ఆల‌యం త‌ర‌ఫున చేప‌ట్టాల్సిన ప‌లు ఆధ్యాత్మిక‌, సేవా కార్యక్రమాల్లోని ముసాయిదాలో పేర్కొన్న నిబంధ‌న‌ల‌కు సీఎం రేవంత్ ప‌లు మార్పులు సూచించారు. వాటిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, తిరుమల తరహాలో యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటైతే ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు

YCP: నారా లోకేష్ ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు.. అరుదైన దృశ్యం

కాంగ్రెస్ తీరు... హంతకుడే సంతాప సభ పెట్టినట్టుగా ఉంది : హరీష్ రావు

UP: హెడ్ మాస్టర్ రెచ్చిపోయాడు.. విచారణకు పిలిస్తే విద్యాధికారిని బెల్టుతో కొట్టాడు (video)

నా భర్త పేరు చేరిస్తే మీ గుట్టు విప్పుతా...

అన్నీ చూడండి

లేటెస్ట్

Navratri 2025 colours: నవరాత్రి ఏ రోజున ఏ రంగు ధరించాలంటే?

నవరాత్రులు ప్రారంభం.. తొలిరోజు శైలపుత్రీ పూజ.. ఎలా చేయాలి?

22-09-2025 సోమవారం ఫలితాలు - నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త....

21-08-2025 ఆదివారం దినఫలితాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

21-09-2025 నుంచి 27-09-2025 వరకు మీ వార రాశిఫలితాల

తర్వాతి కథనం
Show comments