Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెన్ టెంపుల్‌ వినాయకుడి అరుదైన రికార్డ్.. వైఢూర్య కిరీటంతో..?

Webdunia
శనివారం, 29 జులై 2023 (10:20 IST)
Golden Temple Ganapathi
తిరుపతి, కాణిపాకం దర్శనాలకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా వెల్లూరు గోల్డెన్ టెంపుల్‌లోని వినాయకుడిని పూజించడం చేస్తారు. ఈ ఆలయంలో బంగారు లక్ష్మీదేవి విగ్రహంతో పాటు.. ప్రపంచంలోనే అతిపెద్ద 1,700 కిలోల వెండి శ్రీ శక్తి గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
 
2021 జనవరి 25వ తేదీన ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. తాజాగా ఈ శక్తి గణపతి విగ్రహానికి అలంకరించిన కిరీటం అరుదైన రికార్డును సాధించింది. ఈ కిరీటంలో అరుదైన వైఢూర్యాన్ని పొదిగించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వైఢూర్యంగా రికార్డ్ సృష్టించింది. ఈ వజ్రం 880 క్యారెట్ల బరువు కలిగివుంది. 
 
ఇప్పటివరకూ ప్రపంచ రికార్డులో నిలిచిన అతిపెద్ద వైఢూర్యం బరువు 700 క్యారెట్లు మాత్రమే కావడం గమనార్హం. సహజంగా నవరత్నాలకు ప్రత్యేక శక్తిని కలిగివుంటాయి. తొమ్మిది గ్రహాలలోని శక్తులు అక్కడ ప్రసరింపజేస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఆ విధంగా నవరత్నాలలో ఒకటైన వైఢూర్యం కేతు భగవానునికి ప్రతీక. ఆయన శక్తిని అక్కడ ప్రసరింపజేస్తుందని కిరీటం ఏర్పాటు సందర్భంగా పండితులు స్పష్టం చేశారు. ఎంతో విలువైన వైఢూర్యాలను కొనుగోలు చేసి ధరించలేని భక్తులు ఈ గణనాథుడిని దర్శించుకుని ఆశీర్వాదం పొందవచ్చునని శ్రీ శక్తి అమ్మ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TDP Ad in sakshi: సాక్షిలో టీడీపీ కోటి సభ్యత్వం ప్రకటన.. అప్రూవల్ ఇచ్చిందెవరు?

ఎస్‌యూవీ నడుపుతూ ఆత్మహత్య.. కారును నడుపుతూ కాల్చుకున్నాడు..

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై శాశ్వత పరిష్కారం కావాలి.. వైఎస్ షర్మిల

ఆర్మీ ఆఫీసర్‌తో ప్రేయసికి నిశ్చితార్థం, గడ్డి మందు తాగించి ప్రియుడిని చంపేసింది

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Kanuma: సంక్రాంతి సంబరం..కనుమ విశిష్టత.. రైతన్న నేస్తాలు పశువులకు పండగ

Makara Jyothi: శబరిమలపై మకర జ్యోతి.. దివ్య కాంతిని వీక్షించిన లక్షలాది భక్తులు

14-01-2025 మంగళవారం దినఫలితాలు : శ్రమతో కూడిన ఫలితాలున్నాయి...

మకర సంక్రాంతి- 12 రాశులు చేయాల్సిన దానాలు.. గంగమ్మ భువిపైకి?

తర్వాతి కథనం
Show comments