హనుమంతుని శరీరమంతా సిందూరం ఉంటుంది.. ఎందుకు..?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (12:58 IST)
సిందూరం అంటే పెట్టుకునే కుంకుమ. ఆంజనేయునికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని సీతమ్మను అడిగాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పారు.
 
ఈ బొట్టు రాముల వారికి చాలా ఇష్టమని చెప్పారు. దాంతో వెంటనే ఆంజేయుడు సిందూరాన్ని తన శరీరమంతా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండడం చేత ఆ సిందూరం వెంటనే రాలిపోయేది. అప్పుడు హనుమంతుడు నూనెతో కలిపిన గంగ సిందూరాన్ని శరీరమంతా రాసుకున్నాడు. 
 
ఇలాంటి అమాయకపు పనిచేసిన హనుమంతుని చూసిన రాముల వారు.. ఈ రూపంతో నిన్ను ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడును అని అన్నారు. అటువంటి భక్తులకు సమస్త దోషాలు తొలగి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చారు. అందుకే హనుమంతుని శరీరమంతా సిందూరం రాసి ఉంటుంది.  
 
కనుక ప్రతిరోజూ కాకపోయినా వారంలో రెండుసార్లు హనుమంతుని సింధూరాభిషేకం చేయించి.. స్వామివారికి నచ్చిన ఆహారాలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తే వారు కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. దాంతో పాటు రాములవారి దర్శనం కూడా దక్కుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే శిరీషా దేవి

ప్రాణ స్నేహితుడు చనిపోయినా నాకు బుద్ధిరాలేదు... యువకుడు ఆత్మహత్య

ఆమ్రపాలి కాటకు పదోన్నతి... మరో నలుగురికి కూడా...

ప్రేమ, అక్రమ సంబంధం.. ఆపై బ్లాక్‌మెయిల్.. యువకుడిని చంపేసిన అక్కా చెల్లెళ్లు

మేకపోతును బలి ఇచ్చి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి రక్త తర్పణం, ఏడుగురు అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

26-12-2025 శుక్రవారం ఫలితాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

25-12-2025 గురువారం ఫలితాలు - స్థిరాస్తి ధనం అందుతుంది.. తాకట్టు విడిపించుకుంటారు...

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - ధనుస్సుకు అర్దాష్టమ శని ప్రభావం ఎంత?

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - వశ్చిక రాశికి వ్యయం-30

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం: టిటిడి చైర్మన్ ఏం చెప్పారంటే?

తర్వాతి కథనం
Show comments