హనుమంతుని శరీరమంతా సిందూరం ఉంటుంది.. ఎందుకు..?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (12:58 IST)
సిందూరం అంటే పెట్టుకునే కుంకుమ. ఆంజనేయునికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని సీతమ్మను అడిగాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పారు.
 
ఈ బొట్టు రాముల వారికి చాలా ఇష్టమని చెప్పారు. దాంతో వెంటనే ఆంజేయుడు సిందూరాన్ని తన శరీరమంతా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండడం చేత ఆ సిందూరం వెంటనే రాలిపోయేది. అప్పుడు హనుమంతుడు నూనెతో కలిపిన గంగ సిందూరాన్ని శరీరమంతా రాసుకున్నాడు. 
 
ఇలాంటి అమాయకపు పనిచేసిన హనుమంతుని చూసిన రాముల వారు.. ఈ రూపంతో నిన్ను ఎవరైతే సేవిస్తారో వారికి నేను ప్రసన్నుడును అని అన్నారు. అటువంటి భక్తులకు సమస్త దోషాలు తొలగి సుఖశాంతులు పొందుతారని వరం ఇచ్చారు. అందుకే హనుమంతుని శరీరమంతా సిందూరం రాసి ఉంటుంది.  
 
కనుక ప్రతిరోజూ కాకపోయినా వారంలో రెండుసార్లు హనుమంతుని సింధూరాభిషేకం చేయించి.. స్వామివారికి నచ్చిన ఆహారాలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తే వారు కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. దాంతో పాటు రాములవారి దర్శనం కూడా దక్కుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారు స్మగ్లింగ్ కేసు... కన్నడ నటి రన్యా రావు విడుదలవుతారా?

థాంక్యూ సో మచ్ అమ్మా- తారక్‌కు చంద్రబాబు రిప్లై..

కబడ్డీ టోర్నీలో పందెం కాసి చిక్కుల్లోపడిన కర్నాటక మంత్రి.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం

ఇరాన్ నుంచి భారతీయులు తక్షణమే వీడండి: భారత ప్రభుత్వం హెచ్చరిక

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై దాడి చేసిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

20-04-2026 సోమవారం ఫలితాలు : నిర్విరామంగా శ్రమిస్తారు.. ఖర్చులు విపరీతం...

19-04-2026 ఆదివారం ఫలితాలు : ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు...

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున అద్భుత కలయిక.. ఉప్పు, గవ్వలతో ఇలా చేస్తే?

Simhadri Appanna: అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం

Parashurama Jayanti 2026: ప్రదోష కాలంలో జన్మించిన పరశురాముడు.. పూజ ఇలా చేస్తే?

తర్వాతి కథనం
Show comments