Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబాబాకు జీడిపప్పులు, కలకండను నైవేద్యంగా సమర్పిస్తే?

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (17:37 IST)
జీవితంలో సుఖదుఃఖాలుంటాయి. సుఖసంతోషాలుంటే పొంగిపోవడం, ఈతిబాధలుంటే కుంగిపోవడం మానవ నైజం. సుఖదుఃఖాలను ఒకేలా చూసే మనస్తత్వం లభించాలంటే.. సాయిని స్మరించాల్సిందే అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. భయాలను, దుఃఖాలను తొలిగించే మహిమాన్వితుడు సాయి ఒక్కడే. ఈ సాయిబాబా మంత్రాన్ని పఠించడం ద్వారా కష్టనష్టాలన్నీ తొలగిపోతాయి. సర్వశుభాలు చేకూరుతాయి. 
 
"ఓం సాయి గురువాయే నమః
ఓం షిరిడీ దేవాయే నమః
ఓం సర్వ దేవ రూపాయే నమః'' అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం శుచిగా స్నానమాచరించి.. తొమ్మిది సార్లు పఠించాలి. ఇంకా గురువారాల్లో సాయిబాబా ఆలయానికి వెళ్లి ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
సాయిబాబా ఆలయానికి వెళ్లి స్వామివారికి జీడిపప్పు లేదు కలకండలను నైవేద్యంగా సమర్పించి.. ఈ మంత్రాన్ని 108సార్లు ఉచ్చరించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శత్రుభయం వుండదు. ఈతిబాధలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం దరిచేరవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇంకా ఐదు రోజుల పాటు సాయిబాబాను నిష్ఠగా పూజించిన వారికి సకలసంపదలు చేకూరుతాయి. 
 
గురువారం నుంచి ప్రారంభించి సోమవారం వరకు ఉదయం, సాయంత్రం పూట సాయిబాబాకు బూందీని నైవేద్యంగా సమర్పించి.. పుష్పాలు, హారతితో పూజించిన వారికి సకలశుభాలు చేకూరుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

లేటెస్ట్

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

తర్వాతి కథనం
Show comments