Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరియాలతో రొయ్యల మసాలా ఎలా చేయాలి...?

బాణలిలో నూనె పోసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి పేస్టును చేర్చి బాగా వేపుకుని.. పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు చేర్చి దోరగా వేపాలి. ఆపై టమోటా ముక్కలను చేర్చి బాగా వేపుకోవాలి. ఆపై మిరియాలపొడి, ధనియాల పొడి

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (13:12 IST)
రొయ్యల్లో ప్రోటీన్లు, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా వుంటాయి. ఇవి ఎముకలకు బలాన్నిస్తాయి. అందుకే వారానికి ఓసారైనా రొయ్యలను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కీళ్లు, మోకాళ్ల నొప్పులు నయం కావాలంటే.. పిల్లల ఆరోగ్యానికి మేలు చేకూరాలంటే.. రొయ్యలను తినాల్సిందే అంటున్నారు న్యూట్రీషియన్లు. అలాంటి రొయ్యలతో శీతాకాలానికి మేలు చేస్తే మిరియాలతో రొయ్యల మసాలా ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
రొయ్యలు- అరకేజీ 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు 
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు 
ఉల్లి తరుగు - అర కప్పు 
టమోటా తరుగు- అర కప్పు 
మిరియాలపొడి- ఒకటిన్నర స్పూన్ 
ధనియాల పొడి- ఒక టీ స్పూన్ 
పసుపు పొడి - అర టీ స్పూన్ 
జీలకర్ర పొడి- ఒకటిన్నర టీ స్పూన్ 
మిరియాల ముక్కలు - ఒక టేబుల్ స్పూన్ 
కొబ్బరి ముక్కలు - అర కప్పు
కొబ్బరి పాలు - ఒక కప్పు 
ఉప్పు, నూనె - తగినంత 
కరివేపాకు, కొత్తిమీర తరుగు- అర కప్పు
 
తయారీ విధానం :
బాణలిలో నూనె పోసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి పేస్టును చేర్చి బాగా వేపుకుని.. పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు చేర్చి దోరగా వేపాలి. ఆపై టమోటా ముక్కలను చేర్చి బాగా వేపుకోవాలి. ఆపై మిరియాలపొడి, ధనియాల పొడి, పసుపు పొడి, జీలకర్ర పొడులను చేర్చాలి. తగినంత ఉప్పు కూడా చేర్చాలి. బాగా గ్రేవీలా వచ్చిన తర్వాత కొబ్బరి పాలను చేర్చి.. మరిగా ఉడికించిన రొయ్యలను, కొబ్బరి ముక్కలను చేర్చాలి. కొబ్బరి పాలు ఇగిరాక.. కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేయాలి. ఈ మిరియాల రొయ్యల మసాలా రోటీలకు సైడిష్‌గా వాడుకోవచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments