పరాయి మహిళతో వివాహేతర సంబంధం.. భర్తను అడ్డంగా నరికేసిన భార్య

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (12:05 IST)
వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య నరికి చంపేసింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిక్కమాగళూరు జిల్లా హోస్‌పేటకు చెందిన చంద్ర గౌడ (54) భార్య ఇంద్రమ్మతో కలిసి నివసించేవాడు. ఐతే భార్య ఉన్నప్పటికీ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు చంద్రగౌడ. గతంలో ఓ కాఫీ ప్లాంటేషన్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ పరిచయమైంది. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది.
 
చంద్రగౌడ జీవితంలోకి వచ్చిన ఈ మహిళ.. వారి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. వీరిద్దరి వివాహేతర సంబంధం గురించి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. పూర్తిగా ప్రియురాలి మోజులో పడిన చంద్రగౌడ.. భార్య దగ్గరకు వెళ్లడం మానేశాడు. దాదాపుగా ఏడాది పాటు అసలు భార్య దగ్గరకు వెళ్లలేదు. ఈ క్రమంలో భర్తపై కోపం పెంచుకుంది ఇంద్రమ్మ. 
 
తనకు అన్యాయం చేసి మరో మహిళలతో ఉంటున్నాడనే ఆగ్రహంతో ఊగిపోయేది. ఈ క్రమంలో మంగళవారం భార్య వున్న గ్రామానికి వెళ్లాడు చంద్రగౌడ. ఆ రోజు రాత్రి ఆమె ఇంట్లోనే ఉన్నాడు. అప్పటికే భర్తపై పీకలదాక కోపంతో ఉన్న ఇంద్రమ్మ.. చంద్రగౌడ్‌ను చంపేయాలని ప్లాన్ చేసింది. అందుకు ఇదే మంచి సమయమని భావించి పథకాన్ని పక్కాగా అమలు చేసింది.
 
రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత.. చంద్రపై కత్తితో దాడి చేసింది. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంద్రమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments