Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో దారుణ ఘటన-కాబోయే భర్త ఇంట్లో యువతి శవమై..?

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (11:32 IST)
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్త ఇంటిలో యువతి శవమై కనిపించింది. కులం కారణంగా తమ బిడ్డను చంపేసి వుంటారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే  ఆత్మహత్య చేసుకుందని అనుమానాలు వస్తున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే ఐశ్వర్య, అశోక్ కుమార్‌లు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మంచి చదువులు చదివారు. మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఐశ్వర్య దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి.  అశోక్ కుమార్ కుటుంబం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
 
ఇంకా తల్లిదండ్రులు కఠినమైన షరతులు పెట్టారు. అంతేకాదు, పెళ్లికి కూడా ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఎవరూ రావొద్దని షరతు పెట్టారు. ఇందుకు ఐశ్వర్య కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. వీరి పెళ్లి నవంబర్ 23వ తేదీన ఫిక్స్ అయింది.
 
పెళ్లికి ముందు జరగాల్సిన తంతు కూడా మొదలైంది. ఇందులో ఐశ్వర్య కూడా పాల్గొంది. కానీ, సోమవారం ఆమె ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది. 
 
ఈ ఘటనపై యువతి తండ్రి సరైన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ బిడ్డ దళిత కమ్యూనిటీకి చెందిన యువతి కాబట్టి హత్య చేశారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments