వివాహేతర బంధానికి అడ్డు.. భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (11:14 IST)
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సహకారంతో భర్తను కడతేర్చిందో భార్య. ఆపై సహజ మరణమంటూ నాటకమాడినా తప్పించుకోలేకపోయింది. పంజాగుట్ట పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బీహార్‌ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్‌ జా ఉపాధి కోసం నగరానికి వచ్చి ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తా రాజ్‌నగర్‌లో భార్య కుష్బుదేవీ(32), పదేళ్లలోపున్న ఇద్దరు కుమారులతో ఉంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. 
 
2019లో ఖైరతాబాద్‌లో జ్యూస్‌ పాయింట్‌ను ప్రారంభించాడు. ఇందులో పనిచేసేందుకు లాల్‌ బాబు(35) అనే తన బంధువును నియమించాడు. ఈ క్రమంలో కుష్బుదేవికి లాల్‌బాబుకు సాన్నిహిత్యం పెరిగి వివాహేతర బంధానికి దారి తీసింది. ఆరు నెలల క్రితం అతడు తన భార్య మృతిచెందడంతో బిహార్‌ వెళ్లాడు. చాలాకాలం రాకపోవడంతో అతడ్ని జూస్‌ పాయింట్‌ నుంచి తొలగించాడు లక్ష్మణ్‌జా. తర్వాత వచ్చిన లాల్‌బాబు హోటల్‌లో పనికి చేరాడు. కుష్బుదేవితో నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ వివాహేతర బంధాన్ని కొనసాగించసాగాడు.
 
విషయం తెలుసుకున్న లక్ష్మణ్‌ హెచ్చరించినా వీరు ప్రవర్తన మార్చుకోలేదు. తమ బంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన కుష్బుదేవి అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈనెల 14న రాత్రి లక్ష్మణ్‌జా నిద్రిస్తున్న సమయంలో ప్రియుడ్ని ఇంటికి పిలిపించింది. భర్త ఛాతిపై కూర్చుని మెడకు చున్నీ బిగించగా లాల్‌బాబు కదలకుండా చేతులను పట్టుకోవడంతో అతను మరణించాడు. 
 
మరుసటిరోజు ఉదయం భర్త సోదరుడు బిహారి జాకు ఫోన్‌ చేసి విషయం చెప్పి సహజ మరణంగా నమ్మించేందుకు ప్రయత్నించింది. సోదరుడి మృతిపై అనుమానంతో బిహారి జా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. పోస్టుమార్టం నివేదికలో మృతుని ఒంటిపై గాయాలు, బలంగా ఊపిరి ఆడకుండా చేసినట్టు తేలడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments