Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను దుడ్డు కర్రతో కొట్టి చంపిన భార్య...

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (07:32 IST)
మూడు ముళ్ళు వేసినప్పటి నుంచి భర్త పెట్టే చిత్ర హింసలను భరించలేని ఆ మహిళ.. కాళికామాతలా మారిపోయింది. భర్త పెట్టే చిత్రహింసలను ఇక భరించలేనని భావించి.. దుడ్డుకర్రతో భర్తను చావబాదింది. దీంతో కట్టుకున్న భర్త చనిపోయాడు. 
 
చనిపోయిన వ్యక్తి ఓ నేవీ అధికారి కావడం గమనార్హం. ఈయన దక్షిణ గోవాలోని వాస్కో సబ్ జిల్లాలో ఉన్న నేవల్ బేస్‌లో ఐఎన్ఎస్ హన్స నౌకలో ఎయిర్‌క్రాఫ్ట్ విభాగంలో పని చేస్తున్నాడు. ఈయన పేరు కౌశలేంద్ర సింగ్. అతను తరచూ ఇంటికి తాగి వచ్చి భార్యను చితకబాదేవాడు. కొన్నేళ్ల పాటు కౌశలేంద్ర హింసను ఆమె భరించింది. 
 
శనివారం రాత్రి బాగా తాగి వచ్చిన కౌశలేంద్ర భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమె ఇరుగు పొరుగు వారికి తన బాధను వెల్లడించింది. వారు వెళ్లగానే మరోమారు ఆమెపై కౌశలేంద్ర దాడికి తెగబడ్డాడు. ఇక సహించలేకపోయిన ఆమె అతను నిద్రలోకి జారుకోగానే దుడ్డుకర్రతో తలపై బలంగా మోదింది. 
 
గాయాలపాలైన కౌశలేంద్రను చూడగానే భయపడిపోయిన భార్య ఇరుగు పొరుగు సాయంతో నేవల్ ఆసుపత్రికి తరలించింది. అయితే అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. పోలీసులకు సమాచారం చేరవేయగా కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments