Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను దుడ్డు కర్రతో కొట్టి చంపిన భార్య...

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (07:32 IST)
మూడు ముళ్ళు వేసినప్పటి నుంచి భర్త పెట్టే చిత్ర హింసలను భరించలేని ఆ మహిళ.. కాళికామాతలా మారిపోయింది. భర్త పెట్టే చిత్రహింసలను ఇక భరించలేనని భావించి.. దుడ్డుకర్రతో భర్తను చావబాదింది. దీంతో కట్టుకున్న భర్త చనిపోయాడు. 
 
చనిపోయిన వ్యక్తి ఓ నేవీ అధికారి కావడం గమనార్హం. ఈయన దక్షిణ గోవాలోని వాస్కో సబ్ జిల్లాలో ఉన్న నేవల్ బేస్‌లో ఐఎన్ఎస్ హన్స నౌకలో ఎయిర్‌క్రాఫ్ట్ విభాగంలో పని చేస్తున్నాడు. ఈయన పేరు కౌశలేంద్ర సింగ్. అతను తరచూ ఇంటికి తాగి వచ్చి భార్యను చితకబాదేవాడు. కొన్నేళ్ల పాటు కౌశలేంద్ర హింసను ఆమె భరించింది. 
 
శనివారం రాత్రి బాగా తాగి వచ్చిన కౌశలేంద్ర భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమె ఇరుగు పొరుగు వారికి తన బాధను వెల్లడించింది. వారు వెళ్లగానే మరోమారు ఆమెపై కౌశలేంద్ర దాడికి తెగబడ్డాడు. ఇక సహించలేకపోయిన ఆమె అతను నిద్రలోకి జారుకోగానే దుడ్డుకర్రతో తలపై బలంగా మోదింది. 
 
గాయాలపాలైన కౌశలేంద్రను చూడగానే భయపడిపోయిన భార్య ఇరుగు పొరుగు సాయంతో నేవల్ ఆసుపత్రికి తరలించింది. అయితే అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. పోలీసులకు సమాచారం చేరవేయగా కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments