Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శోభనం రాత్రి భార్యను వదిలి పరారైన భర్త.. ఎందుకు?

శోభనం రాత్రి భార్యను వదిలి పరారైన భర్త.. ఎందుకు?
, శనివారం, 1 జూన్ 2019 (14:31 IST)
శోభనం రాత్రి భార్యను వదిలి భర్త ఎందుకు పరారవుతాడు.. ఇదెక్కడో విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా. నిజమేనండి. ప్రేమించాడు. యువతిని నమ్మించి సహజీవనం చేశాడు. చివరకు పెళ్ళి ఊసెత్తేసరికి తప్పించుకుతిరిగాడు. పోలీసుల సాయంతో యువతి పెళ్ళి చేసుకుంటే చివరకు ఆమెను పెళ్లి చేసుకుని శోభనం రోజు రాత్రి ఇంటి నుంచి పరారయ్యాడు.
 
బంజారాహిల్స్ లోని ఎన్‌బీటీ నగర్‌లో నివశించే ఒక యువతి, విశాఖ జిల్లాకు చెందిన రమణగౌతమ్‌లకు గత ఆరేళ్ళకు ముందు పరిచయం ఏర్పడింది. హైదరాబాద్‌లో సినిమా అవకాశాల కోసం వచ్చిన యువతిని రమణ గౌతమ్ మాయమాటలు చెప్పి స్నేహం చేశాడు. సినిమాల్లో ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పి ఆమెను ఆ ఫీల్డ్ నుంచి తప్పించాడు. దీంతో యువతి తన సోదరుడితో కలిసి గల్ప్‌కు వెళ్ళింది. రెండేళ్ల పాటు అక్కడే కష్టపడి పనిచేసి తన ప్రియుడికి డబ్బులు పంపేది.
 
అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. ఆరు నెలల పాటు ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. మళ్ళీ సింగపూర్‌కు వెళ్ళి పనులు  చేసింది యువతి. 5 లక్షల దాకా సంపాదించి గత నెల మళ్ళీ హైదరాబాద్‌కు వచ్చింది. సంపాదించిన డబ్బు మొత్తాన్ని గౌతమ్‌కు ఇచ్చేసింది. డబ్బు మొత్తం తీసుకున్న గౌతమ్ ఇక ఆమెతో పనిలేదని నిర్ణయించుకున్నట్లున్నాడు. వెళ్ళిపోదామనుకునేసరికి యువతి పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చింది.
 
అందుకు అతడు ఒప్పుకోలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు దగ్గరుండి పెళ్ళి చేశారు. శోభనం ఇక మిగిలింది. ఆ సమయంలో ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిన ప్రియుడు మళ్ళీ రాలేదు. గత రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా రెస్పాన్స్ లేదు. దీంతో బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవ్యాంధ్రలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం...