Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారిగా మారిన వాతావరణం.. చల్లబడిన తెలుగు రాష్ట్రాలు

Webdunia
ఆదివారం, 2 జూన్ 2019 (17:58 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో హైదరాబాద్ చల్లబడింది. గత నెలరోజులుగా భానుడి తీవ్రత కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
 
తాజా వర్షంతో నగరం చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తీపి కబురు చెప్పింది.  
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం సాయంత్రం అనూహ్యంగా వాతావరణం మారింది. ఈదురుగాలులు, పిడుగులతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 
 
ఇంకా ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంతంలోని పుల్లలచెరువు మండలంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. మండలంలోని గాజులపాలెంలో ఈదురుగాలులకు ప్రజలు జడుసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments