Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ - ఖర్గేల కోసం జైలు ఎదురు చూస్తోంది...: అస్సాం సీఎం

ఠాగూర్
శుక్రవారం, 18 జులై 2025 (11:00 IST)
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల కోసం తమ రాష్ట్రంలోని జైళ్లు ఎదురు చూస్తున్నాయని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. తాజాగా తమ రాష్ట్రంలో పర్యటించిన రాహుల్.. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని, వీటిని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. రాహుల్, ఖర్గేల అస్సాం పర్యటనపై హిమంత స్పందిస్తూ, రాహుల్ వ్యాఖ్యల కారణంగా రాష్ట్రంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసులపైనే దాడి చేశారని ఆరోపించారు. 
 
అటమీ భూమిలో ప్రజలు స్థిరపడలేరని రాహుల్ గ్రహించలేకపోయారన్నారు. కానీ, కబ్జాదారులకు అదే స్థలంలో పునరావాసం కల్పిస్తామని, ఇళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని హిమంత అన్నారు. ఈ రకమైన ప్రసంగాల కారణంగా రాష్ట్రంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయారన్నారు. వారు రెచ్చిపోయి పోలీసులపైనే దాడి చేశారని ఆరోపించారు. 
 
ర్యాలీలో రాహుల్ గాంధీ, ఖర్గేలు చేసిన ప్రసంగాలను పోలీసులు పరిశీలిస్తున్నారని  వెల్లడించారు. ప్రసంగాలతో హింసలను ప్రేరేపించినట్టు విచారణలో తేలితో రాహుల్, మల్లికార్జున ఖర్గేలపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. ఇప్పటికే వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు చెందిన పలు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయాన్ని హిమంత్ గుర్తుచేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments