Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెవులు మెలేశాడు.. కొరికాడు.. కొట్టాడు.. వీడూ ట్యూషన్ టీచరేనా?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (11:27 IST)
ఇటీవలి కాలంలో ముక్కుపచ్చలారని పసిపిల్లలు చిత్ర హింసలకు గురవుతున్నారు. ముఖ్యంగా, పాఠశాలలకు వెళ్లే చిన్నారుల పట్ల టీచర్లు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. సరిగ్గా చదవలేదనో, హోంవర్క్ పూర్తి చేయలేదనో, ఫీజు కట్టలేదనో, తరగతి గదిలో అల్లరి చేస్తున్నాడనో ఇలా ఏదో ఒక కారణంతో చిన్నారుల పట్ల అత్యంత టీచర్లు అతిక్రూరంగా నడుచుకుంటున్నారు. 
 
తాజాగా ఏడేళ్ళ విద్యార్థిపై ఓ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. అతను పెట్టిన చిత్రహింసలు మొత్తం సీసీ టీవీలో రికార్డు అయింది. ఈ ఘటన ఆలీగఢ్‌లో జరిగింది. ఓ టీచర్ ఇంటికి వెళ్లి ట్యూషన్ చెబుతుంటాడు. అలా ఆలీగఢ్‌లోని ఓ ఇంటికి ప్రతి రోజూ ట్యూషన్‌కు వెళ్లే టీచర్.. ఆ ఇంటి బాలుడుని ఓ కుర్చీలో కూర్చోబెట్టాడు. బాలుడుని నానా రకాలుగా హింసించాడు.
 
బాలుడు జుట్టు పట్టుకున్నాడు. చెవులు మెలేశాడు. కొరికాడు... కొట్టాడు. అదీ కూడా చెప్పుతీసుకుని. వేళ్లను సైతం కొరకడంతో ఆ బాలుడు కెవ్వున కేక పెట్టినా ఏమాత్రం కనికరం చూపలేదు. ఓ గ్లాసుడు మంచినీళ్లిచ్చి నవ్వించే ప్రయత్నం చేశాడు. టీచర్ చేసిన పనిని చూసిన ఆ తండ్రి ఆగ్రహతో ఊగిపోతూ, పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. టీచర్‌ను అరెస్టు చేసి హత్యాయత్న కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments