Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన బీజేపీ కేంద్ర మాజీ మంత్రి

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (11:45 IST)
బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై ఓ న్యాయ విద్యార్థిని సంచలన ఆరోపణలు చేసింది. ఎంతో మంది జీవితాలను ఆయన నాశనం చేశారంటూ ఆరోపించారు. అలా ఆరోపణలు చేసిన మరుక్షణమే ఆ విద్యార్థిని అదృశ్యమైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లోని ఎస్‌ఎస్‌ న్యాయ కాలేజీ విద్యార్థికి  చెందిన చిన్మయానంద్‌ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడంటూ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. 
 
'నాది షాజహాన్‌పూర్‌. నే ను ఎస్‌ఎస్‌ కాలేజీలో ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నాను. ఓ స్వామిజీ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడు. అతనికి వ్యతిరేకంగా నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు నన్ను, నా కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. 
 
మోడీ, యోగి ఆదిత్యనాథ్‌ నన్ను ఆదుకోవాలి. నాకు న్యాయంచేయండి' అంటూ వీడియోలో విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. శుక్రవారం ఈ వీడియో షేర్‌ చేసిన విద్యార్థిని.. శనివారం నుంచి అదృశ్యమైంది. 
 
ఇదిలావుంటే, న్యాయ విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు స్వామి చిన్మయానంద్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు కిడ్నాప్‌, బెదిరింపుల కేసును నమోదు చేశారు. అయితే బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నట్లుగా లైంగిక వేధింపుల ఆరోపణలను మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం