Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అదనపు కట్నం కోసం అత్త ముక్కును కొరికిన అల్లుడు

అదనపు కట్నం కోసం అత్త ముక్కును కొరికిన అల్లుడు
, సోమవారం, 26 ఆగస్టు 2019 (17:59 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీలో ఓ దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం ఓ అల్లుడు అత్త ముక్కును కొరికేశాడు. అలాగే, ఆయన తండ్రి ఆమె చెవిని కొరికేశాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
బరేలీకి చెందిన రెహ్మాన్‌, గుల్షాన్‌ దంపతుల కుమార్తె చాంద్‌ బీకి ప్రాపర్టీ డీలర్‌ అయిన మహ్మద్‌ ఆష్ఫక్‌తో ఒక యేడాది క్రితం పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో కట్నం కింద మహ్మద్‌కు రూ.10 లక్షలు ఇచ్చారు. 
 
ఒక యేడాది లోపే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మహ్మద్‌తో పాటు అతని తల్లిదండ్రులు అదనంగా మరో రూ.5 లక్షలు తేవాలని చాంద్‌ బీని డిమాండ్‌ చేశారు. ఇందుకు రెహ్మాన్‌ అంగీకరించలేదు. 
 
ఈ నేపథ్యంలో తన భార్య చాంద్ బీని తీసుకుని మహ్మద్ అత్తారింటికి వెళ్లాడు. అక్కడ అదనపు కట్నం విషయంపై వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహ్మద్ అత్త గుల్షాన్‌ ముక్కును కొరికేశాడు. ఆమె చెవిని మహ్మద్ తండ్రి కొరకడమే కాకుండా, కత్తితో కత్తిరించాడు. 
 
దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ లోపే మహ్మద్‌, అతని తండ్రి పరారీ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రింట్‌ మీడియా పైనే నమ్మకం ఎక్కువ: ప్రణబ్‌