Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ళ బాలికపై అంకుల్ అత్యాచారం.. నదిలో శవం

Webdunia
ఆదివారం, 9 జూన్ 2019 (11:12 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఐదేళ్ళ బాలికపై ఆ బాలిక అంకుల్‌తో పాటు మరికొందరు కలిసి అత్యాచారం జరిపారు. ఆ తర్వాత చిన్నారిని హత్య చేసి బావిలో పడేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉజ్జయినిలో ఇటీవల ఐదేళ్ళ బాలిక అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేసి చంపేశారు. నిజానికి ఈ చిన్నారి శుక్రవారం అదృశ్యంకాగా, అదే రోజు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని బాలిక కోసం గాలిస్తున్న పోలీసులు సాయంత్రం షిప్రా నదిలో తేలియాడుతున్న బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
చిన్నారి శరీరంపై ఉన్న గాయాలను బట్టి ఆమెపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శనివారం నాటి వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్టు తేలింది. ఈ కేసులో బాలిక అంకుల్ సహా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాలికపై అత్యాచారం, హత్య ఘటనతో మధ్యప్రదేశ్ వేడెక్కింది. ప్రతిపక్షాలు ఈ ఘటనను ఆయుధంగా చేసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments