Trump, 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే?: ఆప్ ఎంపీ నిప్పులు

ఐవీఆర్
శుక్రవారం, 8 ఆగస్టు 2025 (12:18 IST)
రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు అశోక్ మిట్టల్ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పైన నిప్పులు చెరిగారు. 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే ఏమవుతుందో తెలుసా ట్రంప్ అంటూ ఆయనకు ఒక పదునైన బహిరంగ లేఖ రాశారు. రష్యా చమురు దిగుమతుల నేపధ్యంలో భారతదేశంపై ఇటీవల 50% సుంకాలు విధించడాన్ని ఖండిస్తూ, వాణిజ్య చర్యలు కొనసాగితే తీవ్ర ఆర్థిక పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
 
అశోక్ మిట్టల్, ట్విట్టర్ X వేదికగా పంచుకున్న తన లేఖలో ట్రంప్ సుంకాల నిర్ణయాన్ని తూర్పారబట్టారు. అందులో ఆయన... సుదీర్ఘ వ్యూహాత్మక, విలువల ఆధారిత భాగస్వామ్యం కలిగిన రెండు దేశాలకు ట్రంప్ నిర్ణయం తీవ్రంగా నిరాశపరిచింది అని పేర్కొన్నారు. ఆగస్టు 7, 1905న ప్రారంభించబడిన స్వదేశీ ఉద్యమం యొక్క స్ఫూర్తిని ప్రేరేపిస్తూ, భారతదేశం అమెరికా వ్యాపారాలను పరిమితం చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకోగలదని ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హెచ్చరించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments