Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం పెట్టుకున్నారనీ.. పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి..

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (09:11 IST)
త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలాకు సమీపంలోని బెలోనియా అనే పట్టణంలో ఓ ఘటన జరిగింది. ఓ జంట అక్రమ సంబంధం పెట్టుకుంది. దీన్ని తప్పుబట్టిన స్థానికులు ఆ జంటను పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి చావ బాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఒక వ్యక్తికి పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బంధువుల ఇంట్లో ఉంటున్న 20 యేళ్ల యువతికి, ఈయనకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో శనివారం వారిద్దరూ కలిసి ఉండగా మహిళ బంధువులు ఆ జంటను పట్టుకున్నారు. 
 
అనంతరం వారిని విద్యుత్ స్తంభానికి తాళ్లతో కట్టేశారు. అంతా చూస్తుండగా వారిద్దరిని కొట్టారు. ఆ ప్రాంతంలోని స్థానికులు వారిని కాపాడేందుకు ముందుకు రాలేదు. అయితే, వారిపై దాడి చేస్తున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
దీంతో ఈ వీడియో ఇపుడు వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. అయితే తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఆ వ్యక్తి లేదా మహిళ ముందుకు రాలేదు. దీంతో పోలీసులే ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. లావణ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడా?

సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ అందుకే రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది : శింగనమల రమేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments