Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన 43 రోజులకే భార్యను చంపేశాడా.. ఆత్మహత్య కూడా..?

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (09:01 IST)
భార్యాభర్తల అనుబంధం, ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. అక్రమ సంబంధాల కోసం చేసే నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా పెళ్లైన 43 రోజులకే ఓ భర్త తన భార్యను గొంతు కోసి హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని సేలం జిల్లా వీరాణం ఒరత్తరు పట్టిలో చోటుచేసుకుంది. విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న వీరానం పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. 
 
పోలీసుల విచారణలో గత నెల 24వ తేదీన మోనీషా మేనత్త కుమారుడు మోనీషా పుట్టినరోజు సందర్భంగా కేక్‌ ఇవ్వడానికి వచ్చివెళ్లాడు. దీంతో తంగరాజ్‌ భార్య మీద అనుమానంతో వేధించడం మొదలెట్టాడు. ఆ అనుమానంతోనే భ్యార మోనీషాను తుంగరాజ్ గొంతు కోసి హతమార్చి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. భార్యను చంపిన తర్వాత తంగరాజ్‌ విషం తాగి, ఆ తర్వాత ఉరి వేసుకున్నట్టు విచారణలో వెలుగు చూసిందని పోలీసులు పేర్కొన్నారు. 
 
ఒరత్తరు పట్టికి చెందిన తంగరాజ్‌(33) కు మోనీషా(19)తో ఫిబ్రవరిలో వివాహమైంది. కేవలం 43రోజుల్లోనే తంగరాజ్‌ భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments