Webdunia - Bharat's app for daily news and videos

Install App

17వ లోక్‌సభ ఎంపీలుగా ప్రమాణం చేసిన కొత్త పెళ్లి కుమార్తెలు

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (16:23 IST)
లోక్‌సభ సభ్యులుగా టీఎంసీ తరపున ఎన్నికైన నుస్రత్ జహాన్, నటి మిమి చక్రవర్తిలు 17వ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులంతా లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, కొత్త పెళ్లి కూతుళ్లు అయిన నుస్రత్, మిమి చక్రవర్తిలు మాత్రం వారం రోజలు తర్వాత లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేశారు. సినీ నటి నుంచి రాజకీయనేతగా మహిళగా మారిన నుస్రత్... 17వ లోక్‌సభ ప్రారంభోత్సవ సమావేశాలకు హాజరుకాలేక పోయారు. 
 
దీనికి కారణం... ప్రముఖ పారిశ్రామికవేత్త నిఖిల్ జైన్‌ను ఆమె వివాహం చేసుకోవడమే. వీరి వివాహం ఈ నెల 17వ తేదీన టర్కిష్ పట్టణంలో జరిగింది. ఈ కారణంగా ఆమె ప్రారంభ సమావేశాలకు రాలేక పోయింది. ఇదే రోజున లోక్‌సభ సమావేశాలు ప్రారంభంకావడంతో ఆమె సభకు హాజరుకాలేదు. అలాగే, మరో నటి మిమి చక్రవర్తి కూడా 17వ లోక్‌సభ సమావేశాలకు హాజరుకాలేదు. కారణం.. నుస్రత్ జహన్‌తో పాటు ఈమె పెళ్లి కూడా జరిగింది. 
 
17వ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుస్రత్, మిమిలు మాట్లాడుతూ, అనేక ప్రాధాన్య అంశాలపై సభలో ప్రస్తావించాల్సివుందన్నారు. ముఖ్యంగా తొలుత తమతమ నియోజకవర్గాల్లో సమస్యలపై తమ వాదన వినిపిస్తామని, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments