Webdunia - Bharat's app for daily news and videos

Install App

17వ లోక్‌సభ ఎంపీలుగా ప్రమాణం చేసిన కొత్త పెళ్లి కుమార్తెలు

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (16:23 IST)
లోక్‌సభ సభ్యులుగా టీఎంసీ తరపున ఎన్నికైన నుస్రత్ జహాన్, నటి మిమి చక్రవర్తిలు 17వ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులంతా లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, కొత్త పెళ్లి కూతుళ్లు అయిన నుస్రత్, మిమి చక్రవర్తిలు మాత్రం వారం రోజలు తర్వాత లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం స్వీకారం చేశారు. సినీ నటి నుంచి రాజకీయనేతగా మహిళగా మారిన నుస్రత్... 17వ లోక్‌సభ ప్రారంభోత్సవ సమావేశాలకు హాజరుకాలేక పోయారు. 
 
దీనికి కారణం... ప్రముఖ పారిశ్రామికవేత్త నిఖిల్ జైన్‌ను ఆమె వివాహం చేసుకోవడమే. వీరి వివాహం ఈ నెల 17వ తేదీన టర్కిష్ పట్టణంలో జరిగింది. ఈ కారణంగా ఆమె ప్రారంభ సమావేశాలకు రాలేక పోయింది. ఇదే రోజున లోక్‌సభ సమావేశాలు ప్రారంభంకావడంతో ఆమె సభకు హాజరుకాలేదు. అలాగే, మరో నటి మిమి చక్రవర్తి కూడా 17వ లోక్‌సభ సమావేశాలకు హాజరుకాలేదు. కారణం.. నుస్రత్ జహన్‌తో పాటు ఈమె పెళ్లి కూడా జరిగింది. 
 
17వ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుస్రత్, మిమిలు మాట్లాడుతూ, అనేక ప్రాధాన్య అంశాలపై సభలో ప్రస్తావించాల్సివుందన్నారు. ముఖ్యంగా తొలుత తమతమ నియోజకవర్గాల్లో సమస్యలపై తమ వాదన వినిపిస్తామని, ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments