Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డివాడిని చేసిన ప్రేమ : ప్రియుడిపై ద్రావకంతో ప్రియురాలి దాడి

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (12:09 IST)
తనను ప్రేమించి, పెళ్లికి నిరాకరించిన ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ పోసింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ చర్యకు పాల్పడిన ఆ యువతిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువనంతపురం, పూజపుర అనే ప్రాంతానికి చెందిన అరుణ్ కుమార్ (27) అనే యువకుడు ఆదిమాలి పట్టణానికి చెందిన షీబా (35) అనే మహిళను ప్రేమించాడు. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ ప్రేమ కొనసాగింది. పైగా, కొంతకాలంగా సన్నిహితంగా ఉంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిని షీబా ఒత్తిడి చేసింది. కానీ, ఏడేళ్ళ వయస్సు వ్యత్యాసం ఉండటంతో అరుణ్ కుమార్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన షీబా... ప్రియుడి ముఖంపై యాసిడ్ పోయడంతో అతనికి కంటి చూపు పోయింది. 
 
ఈ ఘటన ఈ నెల 16వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి షీబాను అరెస్టు చేశారు. అరుణ్ కుమార్‌కు మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కాలేజీకి తరలించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments