Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లిఫ్ట్ ఇచ్చిన పాపానికి పోలీసుకే కిలేడీ చుక్కలు.. ఏం చేసిందంటే?

లిఫ్ట్ ఇచ్చిన పాపానికి పోలీసుకే కిలేడీ చుక్కలు.. ఏం చేసిందంటే?
, గురువారం, 18 నవంబరు 2021 (09:48 IST)
లిఫ్ట్ ఇచ్చిన పాపానికి పోలీసుకే ఓ మహిళ చుక్కలు చూపించింది. మహిళా దొంగ అర్థరాత్రి ఒంటరిగా ఉన్నానంటూ.. లిఫ్టు అడిగి ఏకంగా ఓ కానిస్టేబుల్ నుండే బంగారు గొలుసు కొట్టెసింది. అయితే చివరికి ఆ కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసును చేధించి యువతిని పోలీసులు అరెస్ట్ చేసారు. 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ సన్‌సిటీలో నివాసం ఉండే ఈశ్వర్‌ ప్రసాద్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఈ నెల 12న రాత్రి 8:30 సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా గ్రీన్‌ల్యాండ్స్‌ వద్ద ఓ యువతి లిఫ్ట్‌ అడగగా ఆమెకు లిఫ్ట్‌ ఇచ్చాడు.
 
రాత్రి 9 గంటలకు ఆమెను పంజగుట్టలో దింపి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఆ యువతి కానిస్టేబుల్‌ను మాటల్లోకి దింపింది. దీంతో కానిస్టేబుల్ మెడలో ఉన్న గొలుసును కొట్టేసింది. అయితే ఇది గమనించని కానిస్టేబుల్ నేరుగా ఇంటికి వెళ్లి స్నానం చేసే సమయంలో తన బంగారు గొలుసు మాయమైనట్లు తెలుసుకున్నాడు. వెంటనే తాను విధులు నిర్వహించిన స్థానానికి వెళ్లి వెతికాడు.
 
కాని అక్కడ కూడా లేకపోవడంతో.. దీంతో వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సీసి కెమెరాలను పరిశీలించి నిందుతురాలు ఎవరనే విషయాన్ని కనుకొన్నారు.
 
అయితే ట్విస్ట్ ఏటంటే దొంగతనం చేసిన మహిళ.. మరోసారి మహంకాళి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కూడా ఇలాంటీ ప్రయత్నం చేయడంతో ఆ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అసలు విషయం ఒప్పుకుంది. కాగా ఆమె ట్రాన్స్‌జెండర్ అని బెంగళూరులో ఉంటూ దొంగతానల కోసమే హైదరాబాద్‌కు వచ్చి వెళ్లిపోతుందని పోలీసులు వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో అందమైన భార్య వున్నా.. తమ్ముడితో కలిసి ఆ పని చేశాడు..