Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్టీ అవగానే మాజీ మిస్ కేరళ, రన్నరప్‌లను తనతో రమ్మన్నాడు, కాదనేసరికి ఆడి కారులో...

పార్టీ అవగానే మాజీ మిస్ కేరళ, రన్నరప్‌లను తనతో రమ్మన్నాడు, కాదనేసరికి ఆడి కారులో...
, శనివారం, 20 నవంబరు 2021 (16:03 IST)
నవంబరు 1వ తేదీ 2021న మాజీ మిస్ కేరళ అన్సీ, రన్నరప్ అంజనా షాజన్ ఇద్దరూ కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అలా దుర్మరణం చెందేట్లు వెంటాడాడు ఓ డ్రగ్ పెడ్లర్. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు. ఆరోజు ఓ హోటల్లో పార్టీ ముగియగానే వారిద్దరినీ తన కారులో రావాలంటూ ఆహ్వానించాడు. అందుకు వారు ససేమిరా అన్నారు.

 
దాంతో వారు ప్రయాణిస్తున్న కారును తన ఆడి కారులో వెంబడించి తరుమాడు. భయపడిపోయిన వాళ్లిద్దరూ కారు వేగాన్ని మరింత పెంచారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ఓ సైక్లిస్టును తప్పించబోయే ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయారు. ఇదంతా పోలీసుల విచారణలో తేలింది.

 
కాగా మాజీ మిస్ కేరళను, రన్నరప్ ఇద్దరినీ తరుముకుంటూ వచ్చిన వ్యక్తి సైజు థంక్‌చన్ అని పోలీసుల విచారణలో తేలింది. ఇతడికి కొచ్చిలోని డ్రగ్స్ పెడ్లర్స్ తో సంబంధాలున్నాయనీ, ఆ రోజు హోటల్లో కూడా పార్టీలో డ్రగ్స్ వాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా హోటల్ యజమానితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు. మొత్తమ్మీద మాదక ద్రవ్యాల పెడ్లర్ కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబు ట్రాప్‌లో నందమూరి కుటుంబం.. నోటికొచ్చినట్టు మాట్లాడితే మహిళలు రాజకీయాల్లోకి వస్తారా?