Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నెలలకే కోటి రూపాయల అల్పాహారం ఆరగించిన 'అమ్మ' జయలలిత... ట్రీట్మెంట్‌కు ఎంతో?

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (14:12 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మిస్టరీ డెత్ అంటూ ఇప్పటికే చాలా వాదనలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేస్తోంది ఓ కమిటీ. ఇందులో భాగంగా కమిటీ చేస్తున్న విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో సెప్టెంబరు 22, 2015న చేరారు. డిశెంబరు 5 న కన్నుమూశారు. ఐతే ఈమధ్య మూడు నెలల కాలంలో ఆమెకు అయిన ఖర్చు వివరాలను చూస్తే కళ్లు తిరుగుతాయి.
 
ఆమె ఉదయం పూట చేసే అల్పాహారానికి మూడు నెలలకు ఏకంగా రూ. 1,17,04,925 అయ్యాయట. ఇక ఆమె చికిత్సకు రూ. 6.85 కోట్లు ఖర్చయిందట. రిటైర్డ్ జడ్జ్ ఆర్ముగస్వామి ఆధ్వర్వలో కమిటీ విచారణ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అపోలో ఆసుపత్రికి సంబంధించి 150 మందిని విచారణ చేశారు. వారు చెప్పిన వివరాలన్నిటినీ నివేదికలో పొందుపరుస్తున్నారు. 
 
చికిత్స జరిగిన సమయంలో జయలలిత వద్దకు వచ్చినవారు ఎవరూ, ఎవరెవరు ఎపుడెపుడు వచ్చి వెళ్లారన్న విషయాలతో పాటు ఖర్చు వివరాలను కూడా అడిగారు. దాంతో అపోలో అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ లెక్కలను కమిటీ చేతుల్లో పెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments