Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి లక్షణాలుంటే 7 రోజుల్లోపు పరీక్షలు

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:55 IST)
కరోనా కేసులను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా భారత వైద్య పరిశోధన మండలి కీలక నిర్ణయం తీసుకుంది. జ్వరం, దగ్గు, గొంతులో ఇబ్బంది, జలుబు వంటి ఫ్లూ లక్షణాలు ఉన్నవారందరికీ ఏడు రోజుల్లోపు రియల్‌టైమ్ రివర్స్ ట్రాన్స్‌ క్రిప్షన్-పాలీమెరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టీ-పీసీఆర్) పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్దేశించింది.

ఈ పరీక్షల్లో నెగటివ్ వస్తే ఏడు రోజుల తర్వాత యాంటీ బాడీ టెస్ట్‌లు చేయాలని పేర్కొంది. ఈ మేరకు కరోనా వ్యూహాన్ని సవరించిన ఐసీఎంఆర్.. వైరస్‌ సోకిన వారితో ప్రత్యక్ష సంబంధమున్న వారిని..ముప్పు ఎక్కువగా ఉన్నవారిగా పరిగణించాలని సూచించింది.

వారు సన్నిహితంగా మెలిగిన నాటి నుంచి 5-14 రోజుల మధ్యలో... ఒకసారి పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. హాట్‌స్పాట్లు, క్లస్టర్లు, ఎక్కువమంది వలస కూలీలు గుమికూడిన ప్రదేశాలు, ఖాళీ చేయించిన ప్రాంతాల్లో 5 నుంచి 14 రోజుల మధ్యలో పరీక్షలు నిర్వహించాలని సూచించింది.

తీవ్ర శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ పరీక్షలు చేయాలన్న ఐసీఎంఆర్.. విదేశాల నుంచి వచ్చి కరోనా లక్షణాలతో కనిపిస్తున్నవారు, పాజిటివ్‌గా తేలినవారితో సంబంధమున్న వారు, వైరస్‌ లక్షణాలు కనిపించే వైద్య ఆరోగ్య సిబ్బందికి పరీక్షలు చేయాలని నిర్దేశించింది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments