Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ఇంటి ముందే భార్య మృతదేహం పూడ్చివేత

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (11:06 IST)
తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట జిల్లాలో భర్త, అత్తమామల వేధింపులు కారణంగా నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఆ గర్భిణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత పోలీసులు బంధువులకు అప్పగించారు. అయితే, వారు మృతదేహాన్ని శ్మశానంలో పాతిపెట్టకుండా, భర్త ఇటి ముందే పూడ్చి పెట్టారు. దీనికి సంబంధించి 50 మందిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని అన్నవాసల్ సమీపంలోని విలాసపట్టిలో గత నెల 29వ తేదీన కుటుంబ సమస్యతో నాగేశ్వరి అనే 8 నెలల గర్భిణి విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుదుక్కోట  ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
 
ఈ ఆత్మహత్య కేసులో ఆమె భర్త, మామ తంగమణి, అత్త విజయలను పోలీసులు అరెస్టు చేసి జైలుకుపంపించారు. ఈ ముగ్గురు జైలులో ఉండగా, నాగేశ్వరి మృతదేహాన్ని విలాపట్టిలోని భర్త ఇంటి ముందు గొయ్యి తీసి పాతిపెట్టారు. ఈ విషయాన్ని విజయ సోదరుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లి లిఖితపూర్వక ఫిర్యాదు చేశాడు. దీంతో అన్నవాసల్ పోలీసులు మృతదేహాన్ని ఇంటి గేటు వద్ద పూడ్చిపెట్టినందుకు 50 మందిపై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments