Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితంపై విరక్తి.. ఆ వృద్ధుడు చితిపై పడుకుని నిప్పంటించుకున్నాడు

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (18:38 IST)
వృద్ధుడైపోయాడు. భార్య కూడా కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. అన్నీ తానై చూసుకోవాల్సిన కుమారుడు కూడా మరణించాడు. ఇక ఒంటరితనం ఆ వృద్ధుడిని వేధించింది.

అనాథగా మారిపోయిన అతనికి భార్య, కుమారుడి జ్ఞాపకాలే గుర్తుకు వచ్చాయి. దాంతో తనను తాను పోషించుకోలేక.. జీవితంపై విరక్తితో ఆ వృద్ధుడు తనకు తానే చితిని పేర్చుకుని.. దానిపై పడుకుని నిప్పంటించుకున్నాడు. 
 
ఈ ఘటన తమిళనాడు, తిరుప్పూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుప్పూరుకు చెందిన అజ్జప్ప (85) కుమారుడు సిద్ధప్ప (58) గత ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు.
 
కోడలు, మనవళ్లు ఉన్నా.. గొడవల కారణంగా పట్టించుకోలేదు. దాంతో అజ్జప్ప మానసికంగా కృంగిపోయాడు. ఊరు వదలి వెళ్లిపోయి దేవాలయాలు, పాడుబడ్డ భవనాల్లో నివసిస్తూ ఉండేవాడు. ఐతే నాలుగు రోజులుగా అతడు కనిపించడం లేదు. ఈ క్రమంలో గొరవెహళ్ల అటవీ ప్రాంతంలో సగం కాలిన వృద్ధుడి శవాన్ని గుర్తించిన గొర్రెల కాపర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాలిన మృతదేహం అజ్జప్పదని తేల్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments