Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుకలు 12 బాటిళ్ల మద్యాన్ని తాగేశాయి..

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (16:27 IST)
ఎలుకలు 12 బాటిళ్ల మద్యాన్ని ఖాళీ చేశాయి. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నీలగిరి జిల్లా శివారులోని టాస్మాక్ దుకాణంలో చోటు చేసుకుంది. 
 
సోమవారం ఉద్యోగి దుకాణం తెరిచిన సమయంలో 12 సీసాల మధ్యం ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) కదంపూజాలో ప్రాంతంలో ప్రభుత్వం మద్యం దుకాణం నిర్వహిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దుకాణాన్ని సిబ్బంది మూసివేశారు.
 
నిబంధనలు సడలించడంతో.. చాలా రోజుల తర్వాత సోమవారం దుకాణం తిరిగి తెరిచిన సమయంలో 12 బాటిళ్లలో మద్యం ఖాళీగా ఉంది. అయితే, బాటిళ్ల సీసాలు ఖాళీగా ఉండడాన్ని గుర్తించారు. వాటిపై ఎలుకలు కొరికినట్లు గుర్తులు ఉన్నాయి. ఆ తర్వాత సదరు ఉద్యోగి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. 
 
టాస్మాక్‌ సీనియర్‌ అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో దుకాణం వద్ద ఎలుకలు పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించారు. అవే సీసాల నుంచి మద్యం ఖాళీ చేశాయని తేల్చారు. ఒక్కో మద్యం బాటిల్‌ ధర రూ.1500 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments