Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుకలు 12 బాటిళ్ల మద్యాన్ని తాగేశాయి..

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (16:27 IST)
ఎలుకలు 12 బాటిళ్ల మద్యాన్ని ఖాళీ చేశాయి. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నీలగిరి జిల్లా శివారులోని టాస్మాక్ దుకాణంలో చోటు చేసుకుంది. 
 
సోమవారం ఉద్యోగి దుకాణం తెరిచిన సమయంలో 12 సీసాల మధ్యం ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) కదంపూజాలో ప్రాంతంలో ప్రభుత్వం మద్యం దుకాణం నిర్వహిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దుకాణాన్ని సిబ్బంది మూసివేశారు.
 
నిబంధనలు సడలించడంతో.. చాలా రోజుల తర్వాత సోమవారం దుకాణం తిరిగి తెరిచిన సమయంలో 12 బాటిళ్లలో మద్యం ఖాళీగా ఉంది. అయితే, బాటిళ్ల సీసాలు ఖాళీగా ఉండడాన్ని గుర్తించారు. వాటిపై ఎలుకలు కొరికినట్లు గుర్తులు ఉన్నాయి. ఆ తర్వాత సదరు ఉద్యోగి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. 
 
టాస్మాక్‌ సీనియర్‌ అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో దుకాణం వద్ద ఎలుకలు పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించారు. అవే సీసాల నుంచి మద్యం ఖాళీ చేశాయని తేల్చారు. ఒక్కో మద్యం బాటిల్‌ ధర రూ.1500 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments