రాంకీ ఛైర్మ‌న్ ఇంట్లో ఐ.టి.సోదాలు, వైసీపీ ఎంపీకీ త‌ప్ప‌లేదా?

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (16:04 IST)
వైసీపీ ఎంపీ, రాంకి గ్రూపు చైర్మన్ అయోధ్య రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు మొద‌ల‌య్యాయి. హైదరాబాదులో 15 చోట్ల ఇన్ కం టాక్స్ టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వ‌హించింది. ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన గచ్చిబౌలి నివాసంలో సోదాలు చేశారు.

అదేవిధంగా ఏక‌కాలంలో గచ్చిబౌలి రాంకి ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు జ‌రిపారు. దీనితోపాటు రాంకి అనుబంధ సంస్థల్లో సైతం ఐటీ సోదాలు చేస్తోంది. 15 బృందాలు వివిధ‌ ప్రాంతాల్లో ఐటీ సోదాలు చేస్తున్నాయి.
 
మంగ‌ళ‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి సోద‌రుడు అయోధ్య రామిరెడ్డి. పార్టీకి ఈ అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రు చేసిన సేవ‌కు ప్ర‌తిఫ‌లంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల అయోధ్య రామిరెడ్డికి రాజ్య‌స‌భ టిక్కెట్ ఇచ్చారు.

ఒక ప‌క్క ఏపీ సీఐడి ఎంపీ ర‌ఘురామ‌పై దాడులు చేస్తున్న త‌రుణంలో, అదే పార్టీకి చెందిన ఎంపీ ఆళ్ళ‌ అయోధ్య రామిరెడ్డి కంపెనీ రాంకీపై కేంద్రం ఐ.టి. దాడులు జ‌ర‌ప‌డం యాధృచ్చికం అయినా, రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను త‌ల‌పిస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments