Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రీడాకారులకు బంపర్ ఆఫర్ : స్వర్ణం గెలిస్తే రూ.3 కోట్లు

Advertiesment
Olympic medalists
, శనివారం, 26 జూన్ 2021 (15:57 IST)
జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరుగనున్నాయి. వచ్చే నెలలో జరిగే ఈ క్రీడల్లో భారత బృందం కూడా పాల్గొంటోంది. జులై 23న ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ఆగస్టు 8న ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 
 
టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం గెలిచే భారత అథ్లెట్లకు ఒక్కొక్కరికి రూ.3 కోట్ల నజరానా ఇస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. రజత పతక విజేతలకు రూ.2 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.1 కోటి అందిస్తామని స్టాలిన్ తెలిపారు. 
 
తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంతో భారత ఒలింపిక్ బృందంలో ఉత్సాహం నెలకొంది. సోషల్ మీడియా వేదికగా భారత అథ్లెట్లు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పాలకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖాళీ స్టేడియాల్లో ఒలింపిక్స్ క్రీడలు