Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడును ముంచెత్తిన వరదలు - రైళ్లలోనే 800 మంది ప్రయాణికులు

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2023 (12:13 IST)
తమిళనాడు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. మిచౌంగ్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఇపుడు దక్షిణాది జిల్లాల్లో వరద బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తిరునెల్వేలి, తూత్కుక్కుడి, కన్యాకుమారి, తెన్‌కాశి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. 
 
ఈ కారణంగా ఈ నాలుగు జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. తిరుచ్చెందూరు నుంచి చెన్నైకు వెళుతున్న ప్రయాణికుల రైలు వరద నీటిలో చిక్కుకుని పోయింది. శ్రీవైకుంఠం వద్ద ఈ రైలు గత 20 గంటలుగ నిలిచిపోయివుంది. ఇందులో సుమారుగా 800 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో 300 మంది సమీపంలోని ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు.
 
తిరునల్వేలి - తిరుచెందూర్ సెక్షన్‌లో శ్రీవైకుంఠం వద్ద వంతెన కొట్టుకుని పోయింది. దీంతో ట్రాక్ నీటిపై వేలాడుతుంది. రైలు పట్టాలపై నీరు ప్రవహిస్తున్నందున దక్షిణ రైల్వే ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా సాధారణ జీవితం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సేవలను కోరింది. వర్ష ప్రభావిత జిల్లాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Idli Kottu Review: ధనుష్ ఇడ్లీ కొట్టుతో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడా... ఇడ్లీ కొట్టు రివ్యూ

Nayana tara: మన శంకర వర ప్రసాద్ గారు జీవితంలో శశిరేఖ ఎవరు...

పవన్ కళ్యాణ్ "ఓజీ" : 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అంటున్న నేహాశెట్టి

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments